News November 28, 2024
నాచారంలో దేశంలోనే అతిపెద్ద హైపర్ మార్ట్ నేడే ప్రారంభం

పటాన్చెరులో అద్భుత విజయం సాధించిన హైపర్ మార్ట్-వ్యాల్యుజోన్ ఇప్పుడు నాచారంలో ప్రారంభంకానుంది. ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ నేడు హైపర్ మార్ట్ను ప్రారంభించనున్నారు. ఫ్యాషన్, కిరాణా సరుకులు, ఫుట్వేర్, లగేజ్, ఫర్నిషింగ్ వంటి బ్రాండ్లను ఒకే చోట అందిస్తోంది వాల్యూజోన్. రోజువారీ అవసరాల నుంచి ప్రత్యేక వస్తువుల వరకు వినియోగదారుల కోసం హైపర్ మార్ట్-వ్యాల్యూజోన్ అందుబాటులోకి రానుంది.
Similar News
News November 8, 2025
జూబ్లీ బైపోల్: మీకేం కావాలి? ఎంత కావాలి?’

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం రేపటితో క్లోజ్. ఇక వీధులు, బస్తీలు నిర్మానుష్యంగా మారుతాయి. సీన్ కట్ చేస్తే ప్రధాన నాయకుల ఇళ్లకు, గెస్ట్ హౌసులకు షిఫ్ట్ అవుతుంది. ప్రచారం ముగియగానే మంతనాలు షురూ అవుతాయి. గంపగుత్తగా ఓట్లు వేయించే వారిని ఇంతకుముందే గుర్తించిన నాయకులు వారితో రేపు చర్చలు జరిపే అవకాశముంది. ప్రతీ ఎన్నికల ముందులాగే.. మీకేం కావాలి? ఎంత కావాలి? అంటూ ప్రలోభపెడుతూ ఓట్లు రాబట్టుకునే పనిలో ఉంటారు.
News November 8, 2025
జూబ్లీహిల్స్: 3 రోజులు సెలవులు.. 2 రోజులు 144 సెక్షన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పోలింగ్ రోజు 11న నియోజకవర్గంలోని Govt, Pvt ఆఫీసులు, స్కూళ్లకు సెలవు ఉంటుంది. 10న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన స్కూళ్లలకు సెలవు ప్రకటించారు. 14న కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో సెలవు ఉంటుందని కలెక్టర్ హరిచందన ప్రకటించారు. అలాగే 10న సా.6 గం. నుంచి 11న సా.6 వరకు, 14న ఉ.6 గం. నుంచి 15న ఉ.6 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ సజ్జనార్ తెలిపారు.
News November 8, 2025
జూబ్లీ బైపోల్: మాగంటి మరణం చుట్టూ రాజకీయం

చావు కూడా రాజకీయాలకు అతీతం కాదని ప్రస్తుత జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం నిరూపిస్తోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీ అని, దానిని ఛేదించాలని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సీఎం మరో ముందడుగు వేసి ఈ విషయంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం విచారణ చేస్తుందని పేర్కొన్నారు. దీంతో బైపోల్ పాలిటిక్స్ పీక్ స్థాయికి చేరుకున్నాయి.


