News March 9, 2025

నాటు సారా రహిత జిల్లాగా శ్రీకాకుళం: కలెక్టర్

image

నాటు సారా రహిత జిల్లాగా శ్రీకాకుళాన్ని తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం చేపట్టిన నవోదయం వెలుగు 2.0 పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రస్తుతం జిల్లాలో 110 గ్రామాలను నాటు సారా ఊరులగా గుర్తించామన్నారు. వీటిని ఏ, బీ, సీ, లుగా విభజించి సారాతో కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు. 

Similar News

News January 27, 2026

పలాస: కుటుంబ కలహాలతో యువకుడి హంగామా

image

పలాస కేటీ రోడ్డు ఇందిరా చౌక్ వద్ద నడిరోడ్డుపై మంగళవారం ఉదయం <<18971917>>మద్యం మత్తులో ఓ యువకుడు<<>> తన చేయిని కోసుకొని వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రశ్నించిన వాహనదారులపై దాడికి యత్నించి భయాభ్రాంతులకు గురి చేశాడు. దీంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలాస రాజాం కాలనీలో నివాసం ఉంటున్న తిరుపతి రావు కుటుంబ కలహాలతో ఈ ఘటనకు పాల్పడినట్లు కాశీబుగ్గ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు.

News January 27, 2026

శ్రీకాకుళం: యాక్సిడెంట్.. రైస్ మిల్లర్ మృతి

image

నరసన్నపేటకు చెందిన రైస్ మిల్లర్ వెంకటరమణ (67) విశాఖపట్నం మద్దిలపాలెం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందాడు. మంగళవారం ఉదయం తన కుమార్తె ఇంటి వద్ద నుంచి మార్కెట్‌కు స్కూటీపై వెళుతుండగా వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News January 27, 2026

పోలమాంబ సిరిమాను సంబరం నేడే..!

image

మక్కువ(M) శంబర శ్రీ పోలమాంబ తల్లి సిరిమానోత్సవానికి అధికారులు అన్నీ సిద్ధం చేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు సిరిమానోత్సవం ప్రారంభం కానుందని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. తొలుత పూజారిని చదురు గుడి నుంచి భుజాలపై మోసుకొని మంగళవాయిద్యాల నడుమ వెళ్లి సిరిమాను అధిరోహిస్తారు. భక్తులు అరటి పండ్లు, చీరలు, కొబ్బరి కాయలతో మొక్కులు చెల్లిస్తారు.