News June 14, 2024

నాడు దేవినేని.. నేడు నిమ్మల రామానాయుడు

image

రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన జలవనరుల శాఖను సీఎం చంద్రబాబు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు కేటాయించారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ శాఖకు మంత్రిగా జిల్లాకు చెందిన దేవినేని ఉమ ఐదేళ్లపాటు పనిచేశారు. సమర్థుడైన నిమ్మల ఈ శాఖకు న్యాయం చేస్తారని, మంత్రిత్వ శాఖల కేటాయింపులో చంద్రబాబు మార్క్ కనిపించిందని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Similar News

News October 2, 2024

కృష్ణా: రేపు టెట్ పరీక్ష రాయనున్న అభ్యర్థులు

image

కృష్ణా, NTR జిల్లాలలో అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. 2 జిల్లాలలోని 9 కేంద్రాలలో మొత్తంగా 58,089 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు టెట్ పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతోందని చెప్పారు. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.

News October 2, 2024

గాంధీజీ బోధనలు మనకు మార్గదర్శకం: అబ్దుల్ నజీర్

image

మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకొని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన స్మృతికి నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన బుధవారం విజయవాడ రాజ్‌భవన్ నుంచి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గాంధీజీ చేసిన శాశ్వతమైన బోధనలు మనందరికీ మార్గదర్శకమని, ప్రజలకు స్ఫూర్తినిచ్చే జీవన విధానంగా అహింస మార్గాన్ని ఆయన బోధించారని గవర్నర్ స్పష్టం చేశారు.

News October 2, 2024

మైలవరం: మాజీ మంత్రి జోగి రమేశ్‌కు నోటీసులు

image

సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరోసారి మాజీ మంత్రి, మైలవరం వైసీపీ ఇన్‌ఛార్జ్ జోగి రమేశ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో నేడు హాజరుకావాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలలోపు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే పలువురుని పోలీసులు అరెస్ట్ చేశారు.