News October 21, 2025

నాడు వణికిన అదిలాబాద్

image

ఉమ్మడి ఆదిలాబాద్‌ను వణికించిన నక్సల్ దాడుల్లో పోలీసుల త్యాగాలు మరువలేనివి. 1987 ఆగస్టు 18న కడెం మండలం అద్దాల తిమ్మాపూర్ వద్ద సాగర్ దళ కమాండర్ మాటువేసి జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఎస్సైలతో సహా 10 మంది పోలీసులు అమరులయ్యారు. 1989లో సింగాపూర్ వద్ద జీపు పేల్చివేతలో ఎస్సై ఖాదర్‌లాక్‌తో సహా ఏడుగురు, 1999లో తర్లుపాడ్ పేలుడులో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Similar News

News October 21, 2025

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం: రేవంత్

image

TG: నిజామాబాద్‌లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి CM రేవంత్ రూ.కోటి పరిహారం ప్రకటించారు. HYDలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ప్రసంగించారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారం ప్రకటించారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు.

News October 21, 2025

MBNR: డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ 3, 5 సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్‌లాగ్) పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎలాంటి ఫైన్ లేకుండా ఈనెల 24 వరకు చెల్లించాలని, ఈనెల 29 వరకు ఫైన్ (లేట్ ఫీజు)తో ఫీజులు చెల్లించాలని తెలిపారు. అలాగే మొదటి సెమిస్టర్ బ్యాక్‌లాగ్ ఫీజును ఎలాంటి ఫైన్ లేకుండా ఈనెల 25 వరకు, లేట్ ఫీజుతో ఈనెల 29 వరకు పరీక్షల ఫీజులు చెల్లించాలని కోరారు.

News October 21, 2025

జగిత్యాల: ఉరివేసుకొని యువకుడి సూసైడ్

image

జగిత్యాల(D) ధర్మపురి మండలం దమ్మన్నపేటకి చెందిన జగిశెట్టి సచిన్(29) ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సచిన్‌కు చిన్నతనంలో చేతికి తగిలిన గాయం కారణంగా ప్రస్తుతం ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాడు. ఇందుకోసం హైదరాబాద్‌లో వైద్యం చేయించారు. 6 నెలల వరకు ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే అనారోగ్యం కారణంతో సచిన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.