News March 14, 2025
నాతవరంలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

నాతవరం మండలం చిక్కుడుపాలెం దగ్గర ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామానికి చెందిన పెదపాత్రుని సత్తిబాబు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ భీమరాజు ఘటనా స్థలికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 21, 2025
MBNR: అన్నదాతల ఖాతాల్లోకి బోనస్ నిధులు..

MBNR జిల్లాలోని సన్న వరి సాగుదారులకు ఆర్థిక ఊరట లభించింది. ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం బోనస్ కింద రూ.21.95 కోట్లను రైతు ఖాతాల్లో జమ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో మొత్తం 7,971 మంది రైతులు ఈ బోనస్కు అర్హత సాధించగా, డిఎం రవి నాయక్ వివరాలను వెల్లడించారు. ముందుగా 4000 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు చేరుతాయని, అనంతరం మిగిలిన రైతులకు జమ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
News December 21, 2025
కన్హా శాంతివనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం

TG: కన్హా శాంతివనంలో హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ధ్యాన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖులు ఒకే వేదికపై ధ్యానం చేశారు. ఇవాళ రాత్రి 8 గంటలకు కన్హా శాంతివనం వేదికగా లక్ష మందితో వర్చువల్ ధ్యానం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం <
News December 21, 2025
హనుమకొండ: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

టాస్క్ రీజనల్ సెంటర్లో నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ అందించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, జనరల్ ఇంగ్లీష్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ అందించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 27 లోపు హనుమకొండ చైతన్య యూనివర్సిటీలోని టాస్క్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.


