News March 14, 2025

నాతవరంలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

image

నాతవరం మండలం చిక్కుడుపాలెం దగ్గర ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామానికి చెందిన పెదపాత్రుని సత్తిబాబు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ భీమరాజు ఘటనా స్థలికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News April 13, 2026

VZM: గొర్రెల కాపరిని తాళ్లతో కట్టిపడేసిన దుండగులు

image

బొండపల్లి మండలం గొల్లలపేట‌కు చెందిన పీతల సత్యం(60) ఆదివారం గ్రామానికి సమీపంలోని చింతల చెరువు వద్ద గొర్రెలు కాస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తాటినారతో కాళ్లు,చేతులు,మెడను కట్టి పొదల్లో పడేసినట్లు బాధితుడు వాపోయాడు. అటువైపుగా వెళ్తున్న వ్యక్తులు సాయంత్రం తుప్పల్లో పడి ఉన్న సత్యం‌ను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి గజపతినగరం ఆసుపత్రి‌కి తరలించారు.

News April 13, 2026

ఏలూరు: ఆ విషాద ఘటనకు నాలుగేళ్లు..!

image

ఏలూరు(D) అక్కిరెడ్డిగూడెం పోరస్ ల్యాబ్స్‌లో 2022 ఏప్రిల్ 13న సంభవించిన రియాక్టర్ పేలుడు తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై APPCB, CPCB విచారణ చేపట్టాయి. భద్రతా ప్రమాణాల ఉల్లంఘనే ఈ ప్రమాదానికి కారణమని విచారణలో తేలింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

News April 13, 2026

ద్రాక్షారామలో ఈ “చిన్న” గుడి రహస్యం తెలుసా?

image

ద్రాక్షారామ ఆలయ ప్రాంగణంలోనే ఒక చిన్న దేవాలయం కనిపిస్తుంది. దీని వెనుక ఓ ఆసక్తికర కథ ఉందని స్థానికులు చెబుతారు. కలియుగం గడిచేకొద్దీ మానవుల ఎత్తు క్రమంగా తగ్గిపోతుందని, అప్పుడు వారు ఈ భారీ ఆలయంలో పూజలు చేయలేరని భావించి, భవిష్యత్తులోని “పొట్టి” మానవుల కోసం ఈ సూక్ష్మ ఆలయాన్ని నిర్మించారట. దీనిని ప్రధాన ఆలయ నమూనాగా కూడా కొందరు పరిశోధకులు భావిస్తారు.