News February 10, 2026
‘నానో అమోనియా యూరియా వినియోగం పెరుగుతోంది’

రాష్ట్రంలో నానో యూరియా, డీఏపీ వినియోగం పెరుగుతోందని కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో కాకినాడ ఎంపీ సానా సతీశ్ రాష్ట్రంలో యూరియా వినియోగం, నానో ఎరువుల లభ్యత పై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారని ఎంపీ కార్యాలయం తెలిపింది. సీజన్ల వారీగా పరిశీలిస్తే ప్రతి సీజన్ కు ఈ వినియోగం పెరుగుతోందని, ఇది శుభ పరిణామం అని మంత్రి ప్రకటించినట్లు ఎంపీ తెలిపారు.
Similar News
News February 14, 2026
రూ.19.60 లక్షల వేతనంతో ఉద్యోగం

‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’ అన్న మాటను పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువుకు చెందిన షేక్ కరిష్మా నిజం చేశారు. బీటెక్ CSE ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆమె ఆస్ట్రేలియాకు చెందిన రైజ్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్లో ఎంపికయ్యారు. ఏకంగా ₹19.60లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించినట్లు కళాశాల యాజమాన్యం వెల్లడించింది. పేద కుటుంబం నుంచి వచ్చిన కరిష్మా, పట్టుదలతో ఈ విజయం సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.
News February 14, 2026
HYD: 3 నెలల్లో ఫుట్పాత్లు క్లియర్!

పాదచారుల భద్రతను మెరుగుపరిచేందుకు ఫుట్పాత్లపై ఆక్రమణలను తొలగించాలని TG హైకోర్టు GHMCని ఆదేశించింది. HYDలో ఉన్న ఫుట్పాత్లను 3 నెలలోగా పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కోర్టు స్పష్టం చేసింది. బాటసారులకు ఆటంకం కలిగిస్తున్న అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ధర్మాసనం స్పష్టంచేసింది.
News February 14, 2026
HYD: 3 నెలల్లో ఫుట్పాత్లు క్లియర్!

పాదచారుల భద్రతను మెరుగుపరిచేందుకు ఫుట్పాత్లపై ఆక్రమణలను తొలగించాలని TG హైకోర్టు GHMCని ఆదేశించింది. HYDలో ఉన్న ఫుట్పాత్లను 3 నెలలోగా పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కోర్టు స్పష్టం చేసింది. బాటసారులకు ఆటంకం కలిగిస్తున్న అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ధర్మాసనం స్పష్టంచేసింది.


