News November 30, 2025

నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి

image

గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, సజావుగా నిర్వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి రిటర్నింగ్ అధికారులకు ఆదేశించారు. మదనాపూర్ మండల కేంద్రంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ..అన్ని నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఫారం 1 ప్రచురణ చేశారా లేదా అని తనిఖీ చేశారు. అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 1, 2025

సిరిసిల్ల: ‘రైతుల ఖాతాల్లో డబ్బులు వెంటవెంటనే జమ చేయాలి’

image

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వెంటవెంటనే జమ కావాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు, ట్యాబ్ ఎంట్రీ, చెల్లింపులపై ఆమె సోమవారం జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చెల్లింపుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని, రైతులను ఇబ్బందులు పెట్టకుండా సకాలంలో ప్రక్రియ పూర్తి చేయాలని DM, DCO, డీసీఎంఎస్ అధికారులకు స్పష్టం చేశారు.

News December 1, 2025

వనపర్తి: రెండోరోజు 399 వార్డు మెంబర్ల నామినేషన్లు దాఖలు

image

వనపర్తి జిల్లాలో రెండో విడతలో జరగనున్న 94 గ్రామ పంచాయతీల్లోని 850 వార్డులకు ఈరోజు మొత్తం 399 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మండలాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
✓ ఆత్మకూర్ మండలం – 47
✓ అమరచింత మండలం – 52
✓ కొత్తకోట మండలం – 130
✓ మదనాపూర్ మండలం – 43
✓ వనపర్తి మండలం – 127 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఇప్పటివరకు మొత్తం వార్డు సభ్యుల నామినేషన్ల సంఖ్య 454కు చేరింది.

News December 1, 2025

GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం.. గవర్నర్ గ్రీన్ సిగ్నల్

image

TG: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)లో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంపై ముందడుగు పడింది. ప్రభుత్వం తీసుకున్న ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వం త్వరలోనే గెజిట్ జారీ చేయనుంది. కాగా <<18393033>>ఈ విస్తరణతో<<>> 2,735 చదరపు కి.మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.