News March 28, 2025
నాయుడుపేటలో బాలికపై అత్యాచారయత్నం.. ఐదేళ్లు శిక్ష

మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో వెంకయ్య అనే వ్యక్తికి నాయుడుపేట కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.22,000 జరిమానా విధించింది. నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలిక ఆడుకుంటుండగా 2019లో వెంకయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అదే రోజు వెంకయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పొక్సో కోర్టు న్యాయమూర్తి సుమ నేరం రుజువు కావడంతో గురువారం శిక్ష ఖరారు చేశారు.
Similar News
News March 31, 2025
చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించారు. ఒకే మైదానంలో వన్డేలు, IPLలో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్గా స్టార్క్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు ఏ బౌలర్ ఈ ఫీట్ సాధించలేకపోయారు. SRHతో జరిగిన మ్యాచులో స్టార్క్ 5 వికెట్లు పడగొట్టారు. 2023లో ఇదే వేదికలో భారత్తో జరిగిన వన్డేలోనూ 5 వికెట్లు తీశారు. అలాగే DC తరఫున 5 వికెట్ల ప్రదర్శన చేసిన తొలి విదేశీ ప్లేయర్గానూ ఆయన నిలిచారు.
News March 31, 2025
కురుపాంలో ఏనుగుల గుంపు సంచారం

పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ఏనుగుల గుంపు నుంచి తిప్పలు తప్పడం లేదు. పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లో సంచరిస్తూ రైతులను, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. సోమవారం ఉదయం కూడా కురుపాం మండలం సీతంపేట, పూతిక వలస ప్రాంతాల్లోని చెరుకు, అరటి, పామాయిల్ తోటల్లో తిరుగుతున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. పొలాలకు వెళ్లే రైతులు, అటుగా ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
News March 31, 2025
నెల్లూరు: ఏప్రిల్ 2 నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ పద్ధతి ప్రారంభం

ఏప్రిల్ రెండవ తేదీ నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ పద్ధతిని ప్రారంభిస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిర్దేశించిన సమయానికి రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఈ పద్ధతిని అమలు చేయనున్నట్లు తెలిపారు.