News September 20, 2025
నాయుడుపేటలో లారీ ఢీకొని ట్రాక్టర్ మెకానిక్ మృతి

నాయుడుపేటలోని ఎల్.ఏ సాగరానికి చెందిన ట్రాక్టర్ మెకానిక్ లక్ష్మణ్ లారీ ఢీకొని శనివారం మృతి చెందాడు. లక్ష్మణ్ నాయుడుపేటలో ట్రాక్టర్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ట్రాక్టర్ సర్వీస్ కోసం బైకుపై ఓజిలికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మూర్తిరెడ్డిపాలెం వద్ద లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట హాస్పిటల్కి తరలించారు. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Similar News
News September 20, 2025
HYD: పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్కు వినతి

పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ను పంచాయితీ కార్యదర్శులు శనివారం HYDలో మర్యాదపూర్వకంగా కలిశారు. 317 జీవోతో పంచాయతీ కార్యదర్శులకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. 317 జీవోతో నష్టపోయిన పంచాయితీ కార్యదర్శులకు 190 జీవో ప్రకారం తాత్కాలిక డిప్యూటేషన్లు, కల్పించాలని కోరారు. దేనికి సంబంధించి వినతిపత్రం అందజేశారు. దీనిపై డిప్యూటీ కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
News September 20, 2025
సంగారెడ్డి: జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలి: కలెక్టర్

జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల కోసం భూసేకరణ వేగవంతం చేయాలని చెప్పారు. భూ సేకరణలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ భూముల అనుమతి కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు.
News September 20, 2025
HYD: పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్కు వినతి

పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ను పంచాయితీ కార్యదర్శులు శనివారం HYDలో మర్యాదపూర్వకంగా కలిశారు. 317 జీవోతో పంచాయతీ కార్యదర్శులకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. 317 జీవోతో నష్టపోయిన పంచాయితీ కార్యదర్శులకు 190 జీవో ప్రకారం తాత్కాలిక డిప్యూటేషన్లు, కల్పించాలని కోరారు. దేనికి సంబంధించి వినతిపత్రం అందజేశారు. దీనిపై డిప్యూటీ కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.