News February 16, 2025
నారాయణఖేడ్: కారు ఆటో ఢీకొని నలుగురుకి గాయాలు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు ఆటో ఢీకొని నలుగురికి గాయాలైన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. మంగల్ పేట బస్ డిపో వద్ద హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఎదురుగా నారాయణఖేడ్ వైపు వెళ్తున్న ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. కారు బోల్తా పడినప్పటికీ కారులో ఉన్న వ్యక్తుల ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదన్నారు.
Similar News
News November 5, 2025
ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో ముమ్మర తనిఖీలు

ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో రాత్రి పూట నడిచే ప్రైవేట్, ఆర్టీసీ ట్రావెల్స్ బస్సుల్లో భద్రతా ప్రమాణాల అమలుపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహన పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, భద్రతా పరికరాలు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
News November 5, 2025
సామూహిక దీపారాధనలో పాల్గొన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ

కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో నిర్వహించిన సామూహిక దీపారాధన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేశ్ బి గితే పాల్గొన్నారు. శ్రీ భీమేశ్వరాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వేములవాడ అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి,ఆలయ ఈవో రమాదేవితో కలిసి ఆయన దీపాలను వెలిగించారు. కాగా, సామూహిక దీపారాధన కార్యక్రమంలో భాగంగా భక్తులు వివిధ ఆకారాల్లో వెలిగించిన దీపాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
News November 5, 2025
వేములవాడ రాజన్న క్షేత్రంలో జ్వాలాతోరణం

కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో బుధవారం సాయంత్రం జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించారు. ఉదయం వేళలో శ్రీ స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసిన ఆలయ అర్చకులు సాయంత్రం ఆలయ రాజగోపురం ముందు భాగంలో జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామివారి మహా పూజ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


