News April 4, 2025

నారాయణపేటలో ఐదుగురిపై కేసు నమోదు

image

నారాయణపేట పట్టణంలో గురువారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ రేవతి తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పారు. వాహనాలకు నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News November 11, 2025

పెళ్లయిన 6 నెలలకే సూసైడ్.. వేధింపులే కారణమా?

image

ఇల్లందు (M) లచ్చగూడెం గ్రామానికి చెందిన 3 నెలల <<18250957>>గర్భిణీ అంజలి<<>> మృతికి అత్తింటి వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఏడాది మే14న పెళ్లైన అంజలిని, ఆమె భర్త సాయికుమార్ కట్నం సరిపోలేదంటూ వేధించేవాడని తెలిపారు. ఈ విషయంపై గతంలో పంచాయతీ కూడా జరిగింది. రెండు రోజుల క్రితం సాయికుమార్, అతని తల్లిదండ్రులు అంజలిని చిత్రహింసలకు గురిచేయడం వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని వారు తెలిపారు.

News November 11, 2025

డేవిడ్ సలయ్‌కి ‘బుకర్ ప్రైజ్’

image

కెనడియన్-హంగేరియన్ రచయిత డేవిడ్ సలయ్‌ను ఈ ఏడాది ‘బుకర్ ప్రైజ్’ వరించింది. సాధారణ మనిషి జీవితం ఆధారంగా ఆయన రాసిన ‘ఫ్లెష్’ నావెల్‌కిగానూ ఈ పురస్కారం దక్కింది. 51 ఏళ్ల డేవిడ్ ఫైనల్లో ఐదుగురు రచయితలను వెనక్కినెట్టారు. వీరిలో ఇండియన్ మహిళా రచయిత కిరణ్ దేశాయ్ కూడా ఉన్నారు. ఆమె రాసిన ‘లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ పుస్తకం బుకర్ దక్కించుకోలేకపోయింది.

News November 11, 2025

తిరుమల: ముగ్గురు పోలీస్ అధికారుల స్టేట్‌మెంట్ రికార్డు

image

పరకామణి చోరీ కేసులో సోమవారం ముగ్గురు పోలీసులను CID బృందం విచారణ చేపట్టింది. కేసులో ఉన్న మాజీ CI జగన్ మోహన్ రెడ్డి, SI లక్ష్మీపతి, విజిలెన్స్ అధికారి గిరిధర్‌ను విచారించారు. కేసు సెక్షన్లు ఏవీ, ఎందుకు పెట్టారు, అరెస్టు ఎందుకు చేయలేదు, రాజీ ఎలా చేశారు, లోక్ అదాలత్‌లో ఎవరు చెబితే పెట్టారనే ప్రశ్నలు వేసి వారి సమాధానాలను రికార్డు చేశారు.