News July 4, 2024
నారాయణపేటలో రోడ్డు ప్రమాదం
నారాయణపేటలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. గొడుగేరి ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఇద్దరు యువకులు స్కూటీపై ప్రధాన రహదారి పైకి వస్తుండగా అదుపుతప్పి వేగంగా వెళుతున్న టిప్పర్ కిందపడి నరసింహారెడ్డి(34) అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక ఉన్న వెంకటేశ్వర్ రెడ్డి చేతికి బలమైన గాయం తగిలింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.
Similar News
News October 12, 2024
సీఎం హోదాలో తొలిసారిగా రేవంత్ స్వగ్రామానికి రాక!
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి సారిగా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లికి నేడు వస్తున్నారు. దసరా పండగకు కుటుంబంతో స్వగ్రామానికి వచ్చే ఆనవాయితీ పాటించే రేవంత్రెడ్డి ఈ సారి సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రానున్నారు. CM రాక సందర్భంగా MLA వంశీకృష్ణ, కలెక్టర్ బదావత్ సంతోష్, కొండారెడ్డిపల్లి నోడల్ ఆఫీసర్ డాక్టర్ రమేశ్ అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
News October 11, 2024
కమిటీలు ఏర్పాటు చేయాలి: గద్వాల కలెక్టర్
గ్రామపంచాయతీలు మునిసిపాలిటీలో ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిపై పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ అడిషనల్ కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన చాంబర్లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కమిటీలలో స్వయం సహాయక గ్రూప్ మహిళలను సభ్యులుగా చేర్చాలన్నారు. స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇండ్ల విషయంలో లబ్ధిదారులకు అవసరమైన సహాయం అందించాలన్నారు.
News October 11, 2024
ఎమ్మెల్యేలంతా వసూల్ రాజాలే: డీకే అరుణ
కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా అక్రమ సంపాదనపై దృష్టిసారించి వసూల్ రాజాలుగా మారారని, ఇప్పటికే ప్రజలు గుర్తించారని MBNR ఎంపీ డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధన్వాడ BJP సభ్యత్వ నమోదులో ఆమె పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ హాయంలో కాళేశ్వరం పేరుతో దోచుకున్నారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో దోచుకుంటున్నారన్నారు.హైడ్రా పేరుతో వసూలుచేసి ఢిల్లీకి సంచులు మోస్తున్నారని ఆమె ఆరోపించారు.