News March 15, 2025

నారాయణపేట్: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

image

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థులకు నేటి నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు తరగతులు జరగనున్నాయి. ఎగ్జామ్ సెంటర్ పడ్డ స్కూల్స్‌లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఏప్రిల్23 వరకు ఈ హాఫ్‌డే స్కూల్స్ ఉంటాయి. ఏప్రిల్24 నుంచి జూన్11 వరకు వేసవి సెలవులు. జూన్12న పాఠశాలలు రీ-ఓపెన్.

Similar News

News November 7, 2025

కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

image

TG: మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. గాడిద ఫొటోపై ‘గాడిద నీపై అరిస్తే.. నువ్వు దానిపై అరవకు’ అని ఉన్న కొటేషన్‌ను షేర్ చేశారు. దీనికి ‘If you know, you know’ అని క్యాప్షన్ పెట్టి స్మైలింగ్ ఎమోజీని జోడించారు. ఇవాళ ప్రెస్‌మీట్‌లో తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం <<18226951>>రేవంత్‌కు<<>> పరోక్ష కౌంటర్‌గానే కేటీఆర్ ఈ ట్వీట్ చేశారని BRS వర్గాలంటున్నాయి.

News November 7, 2025

ఎర్రచందనం సాగు చేస్తున్న 198 మంది రైతులకు రూ.3 కోట్లు విడుదల

image

నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ (NBA) ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం సాగు చేస్తున్న 198 మంది రైతులకు, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఒక అకడమిక్ లబ్ధిదారునికి మొత్తం రూ.3 కోట్లు విడుదల చేసింది. యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ (ABS) విధానంలో భాగంగా ఈ నిధులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ ద్వారా పంపిణీ చేశారు. చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల 48 గ్రామాల రైతులకు ఈ ప్రయోజనం చేకూరింది.

News November 7, 2025

జూబ్లీ ఉపఎన్నిక.. రూ.3.33 కోట్ల నగదు సీజ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.3.33 కోట్లు నగదు, 701 లీటర్ల మద్యం, ల్యాప్‌టాప్‌లు, వాహనాలు వంటి ఉచిత బహుమతులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్‌ 7వ తేదీ ఉదయం వరకు మొత్తం 24 మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి. స్వేచ్ఛా యుతంగా, న్యాయంగా ఎన్నికలు జరగేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు కఠిన నిఘా కొనసాగిస్తున్నాయి.