News March 21, 2025
నారాయణపేట జిల్లాలో 99.7% మంది హాజరు

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు DEO గోవిందరాజులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 39 పరీక్ష కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు జరిగాయి. ఈరోజు పరీక్షలకు 99.7% మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 7,635 మందికి 7,613 మంది పరీక్షలకు హాజరయ్యారు. కాగా 22 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. వన్స్ ఫీల్డ్ క్యాండిడేట్స్ 6 మందికి 03 హాజరుకాగా 3 గైర్హాజరైనట్లు తెలిపారు.
Similar News
News January 8, 2026
బాల్యం ‘బట్టీ’ పాలు కావొద్దు: అడిషనల్ ఎస్పీ

జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు నడుం బిగించారు. ఇటుక బట్టీల్లో చిన్న పిల్లలతో పని చేయిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ రమేష్ స్పష్టం చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో బట్టీల యజమానులతో అవగాహన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు.
News January 8, 2026
భద్రాద్రి: ప్రశాంతంగా ముగిసిన టెట్ పరీక్షలు

టెట్ పరీక్షల నిర్వహణలో భాగంగా గురువారం భద్రాద్రి జిల్లాలో నిర్వహించిన టెట్ పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా ముగిసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ పరీక్షా కేంద్రంలో సెషన్ 1కు మొత్తం 100 మంది అభ్యర్థులు కేటాయించగా, అందులో 87 మంది హాజరై 13 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. అదే విధంగా సెషన్2కు 100 మంది అభ్యర్థులు కేటాయించబడగా, 56 మంది హాజరై 44 మంది గైర్హాజరయ్యారని కలెక్టర్ వివరించారు.
News January 8, 2026
ఏలూరు: ఎంపీ దృష్టికి కోకో రైతుల సమస్యలు

ఏలూరులోని ఎంపీ కార్యాలయంలో గురువారం కోకో రైతులు ఎంపీ మహేశ్ కుమార్ని కలిసి సమస్యలు విన్నవించారు. కంపెనీలు సిండికేట్గా మారి, ధరలు తగ్గించి రైతులను మోసగిస్తున్నాయన్నారు. మన దేశ అవసరాలకు కావాల్సిన కోకో గింజలు 20% మాత్రమే దేశంలో ఉత్పత్తి జరుగుతుందని, 80% కోకో గింజలు, కోకో ఉత్పత్తులను దిగుమతులు చేసుకుంటున్నామని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.


