News April 17, 2025
నారాయణపేట: పదోన్నతులు బాధ్యతలు పెంచుతాయి: ఎస్పీ

పదోన్నతులు ఉద్యోగుల బాధ్యతలను పెంచుతాయని ఎస్పీ యోగేశ్ గౌతమ్ అన్నారు. కానిస్టేబుల్గా పని చేస్తూ హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన శివారెడ్డికి గురువారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో బ్యాడ్జి తొడిగించి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతులు ఉత్సాహాన్ని ఇస్తాయని, ప్రజలకు ఉత్తమ సేవలు అందించి ఉన్నతాధికారులు మన్ననలు పొందాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఐ నరసింహ పాల్గొన్నారు.
Similar News
News January 9, 2026
ఈనెల 10న పెద్ద కొమెరకు మందకృష్ణ మాదిగ రాక

గంపలగూడెం మండలం పెద్ద కొమెర గ్రామంలో ఈనెల 10న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల నుండి ఎస్సీ ప్రజానీకం పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్వాహకులు కరపత్రాల ద్వారా పిలుపునిచ్చారు.
News January 9, 2026
వరంగల్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా

వరంగల్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ జాబ్ మేళా 13-01-2026న ఐటిఐ క్యాంపస్లో నిర్వహించనున్నారు.
ఈ మేళాలో IndusInd Nippon Life Insurance Co. LTD, శ్రీ సాయి అగ్రి టెక్నాలజీస్ సంస్థలు పాల్గొననున్నాయి. IndusInd Nippon Life Insurance సంస్థలో లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులకు 25 ఖాళీలు ఉన్నాయన్నారు.
News January 9, 2026
VZM: ‘ఉపాధి హామీ పని దినాలు పెరుగుతాయి’

వీబీ జీ రామ్ జీ ద్వారా గ్రామీణ ప్రజలకు విస్తృత ఆర్థిక లబ్ధి చేకూరుతుందని MGNREGS డైరెక్టర్ షణ్ముఖ్ తెలిపారు. స్థానిక ఓ హోటల్లో శుక్రవారం నిర్వహించిన మీడియా వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. ఈ పథకం అమలుకు విజయనగరం జిల్లాను పైలట్గా ఎంపిక చేసినట్లు చెప్పారు. ఉపాధి హామీ పనిదినాలు 100 నుంచి 125కి పెరుగుతాయన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


