News March 22, 2025

నారాయణపేట: మే 10న మీ కోసమే..!

image

మే 10న జరిగే లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ పోలీస్, ఎక్సైజ్, కోర్టు అధికారులు చెప్పారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కోర్టు సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కోఆర్డినేషన్ నిర్వహించారు. లోక్ అదాలత్ కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు. పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని అన్నారు. డీఎస్పీ లింగయ్య, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 23, 2025

జడ్చర్ల: చికిత్స పొందుతూ.. యువకుడి మృతి

image

చికిత్స పొందుతూ.. యువకుడు మృతి చెందిన సంఘటన జడ్చర్ల పట్టణంలో జరిగింది. పోలీసుల వివరాలు.. పట్టణానికి చెందిన రవీంద్ర (26) శుక్రవారం కుటుంబ సభ్యులతో భూతగాదాలతో గొడవ పడి పారాసెటమాల్ మాత్రలను వేసుకున్నాడు. అనంతరం మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. శనివారం మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతో రవీంద్ర మరణించాడని, సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఇజాజొద్దీన్ తెలిపారు.

News March 23, 2025

అయిజ: ధాన్యం బస్తాతో శ్రీశైలం పాదయాత్ర

image

కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ నుంచి బసవ అనే భక్తుడు తాను పండించిన తెల్లజొన్న ధాన్యం మల్లికార్జునస్వామికి ముడుపుగా ఇస్తానని మొక్కుబడి పెట్టుకున్నాడు. ఆ మేరకు అతడికి పంట బాగా పండటంతో 50 కేజీల జొన్నల బస్తాను భుజంపై పెట్టుకుని వారం కిందట శ్రీశైలం పాదయాత్ర ప్రారంభించాడు. శనివారం అయిజ మండలం వెంకటాపురం చేరుకున్నాడు. ధాన్యం బస్తా మోస్తూ శ్రీశైలం పాదయాత్ర చేయడం పట్ల నడిగడ్డ వాసులు అతడిని ప్రశంసించారు.

News March 23, 2025

CUET UG దరఖాస్తు గడువు పెంపు

image

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) దరఖాస్తు గడువును NTA పొడిగించింది. ఈనెల 24 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మార్చి 26 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులను సవరించుకోవచ్చు. మే 8 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. సెంట్రల్, స్టేట్, ప్రైవేట్ వర్సిటీల్లో UG కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను CBT విధానంలో 13 భాషల్లో నిర్వహించనున్నారు.

error: Content is protected !!