News April 15, 2025

నారాయణపేట: సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఉన్న నోవాటెల్ హోటల్‌లో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సహచర ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు. సమావేశంలో సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. పథకాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారని ఎమ్మెల్యే అన్నారు.

Similar News

News October 26, 2025

కార్తీకంలో ఈ శ్లోకం పఠించి స్నానం చేస్తే

image

సర్వపాపహరం పుణ్యం స్నానం కార్తీక సంభవం|
నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే||
‘ఓ దామోదరా, అన్ని పాపాలను పోగొట్టే పుణ్యమైన ఈ కార్తీక మాస వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయి. నీకు నమస్కారం అని’ అని ఈ శ్లోక అర్థం. కార్తీక మాసంలో ఈ శ్లోకం పఠించి సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. దీనివల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పేర్కొంటున్నాయి.

News October 26, 2025

ఫెడరల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఫెడరల్ బ్యాంక్ సేల్స్& క్లయింట్ అక్విజిషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ. పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లలోపు ఉండాలి. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.800, ST,SCలకు రూ.160. రాత పరీక్ష నవంబర్ 16న నిర్వహిస్తారు. వెబ్‌సైట్:https://www.federalbank.co.in/

News October 26, 2025

సెలవులు లేవు: కలెక్టర్

image

తుపాన్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి సెలవులు లేవని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. శనివారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో అధికారుల సమర్థవంతంగా పనిచేసి తుపానును ఎదుర్కోవాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను మత్స్యకారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. తుపాను సమయంలో వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.