News April 1, 2025
నారాయణపేట: సెంట్రల్ GOVT జాబ్ కొట్టాడు..!

నారాయణపేట మండల పరిధిలోని కందేన్పల్లి గ్రామానికి చెందిన యువకుడు బోయిని రఘువర్ధన్ ఇండియన్ నేవీ ఆర్మీ జాబ్ సాధించాడు. పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆ యువకుడి తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఎంతో కష్టపడి చదివి జాబ్ సాధించాడు. నేవి జాబ్ సాధించిన రఘువర్ధన్కు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.
Similar News
News April 2, 2025
NZలో వరుసగా 12 వన్డేల్లో ఓడిన పాక్

పాక్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇవాళ న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో పాక్ ఘోరంగా ఓడిపోయింది. న్యూజిలాండ్లో జరిగిన చివరి 12 వన్డేల్లో పాక్ మట్టికరిచింది. ఇప్పటికే మొదటి మ్యాచ్ గెలిచిన NZ వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. అంతకుముందు T20 సిరీస్ను 4-1తో గెలిచింది. స్టార్ ప్లేయర్లు అందుబాటులో లేకున్నా కివీస్ అదరగొట్టింది. NZ-B టీమ్ ముందు కూడా పాక్ చతికిలపడిందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
News April 2, 2025
ములుగు: చర్చలకు మేము సిద్ధం.. ‘మావో’ లేఖ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చలకు మేము సిద్ధమేనని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ములుగు జిల్లాలో ఓ లేఖ చెక్కర్లు కొడుతుంది. ఛతీస్ఘడ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో చేపట్టిన ‘కగార్’ వెంటనే విరమించాలని, బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపేయాలని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమ ప్రతిపాదనలకు స్పందిస్తే తక్షణమే కాల్పులు విరమిస్తామన్నారు.
News April 2, 2025
2019లోనూ నలుగురు MLAలను గెలిపించారు: లోకేశ్

AP: ప్రకాశం జిల్లా అంటే ప్రేమ, పౌరుషం గుర్తొస్తాయని మంత్రి లోకేశ్ అన్నారు. 2019లో TDPకి రాష్ట్రంలో ఎదురుగాలి వీచినా, జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించారని గుర్తుచేశారు. TDP, చంద్రబాబు అంటే ఈ జిల్లా ప్రజలకు చాలా గౌరవం ఉందన్నారు. యువగళం పాదయాత్ర ప్రకాశంలో ఓ ప్రభంజనంలా నడిచిందని, అప్పుడు జిల్లా ప్రజల కష్టాలు చూసినట్లు చెప్పారు. ఆ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పరిశ్రమలు తెస్తున్నట్లు వివరించారు.