News April 16, 2024

నార్నూర్: ఖాళీ బిందెలతో 3 కిలోమీటర్లు నడిచి నిరసన

image

నార్నూర్ మండలం భీంపూర్ పంచాయతీ కొలాం బొజ్జుగూడగిరిజనులు మంచినీరు రావడం లేదని నిరసన తెలిపారు. కొలంగూడ నుంచి ఎంపీడీవో కార్యాలయానికి ఖాళీ బిందెలతో 3 కి.మీ కాలినడకన వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. 45 రోజులుగా మంచి నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు పేర్కొన్నారు. MLA కోవ లక్ష్మి మిషన్ భగీరథ పైపులైన్ కోసం రూ. 5 లక్షలు మంజూరు చేసినా అధికారులు స్పందించకపోవడంతో నీటి వెతలు తప్పడం లేదన్నారు.

Similar News

News April 22, 2025

ADB: హెడ్ కానిస్టేబుల్ బిడ్డకి సివిల్స్‌లో 68వ ర్యాంకు

image

హెడ్ కానిస్టేబుల్ కొడుకు సివిల్స్‌ ఫలితాల్లో 68వ ర్యాంక్ సాధించి జిల్లావాసుల మన్ననలు పొందారు. ఉట్నూర్‌కు చెందిన జాదవ్ సాయి చైతన్య నాయక్ సివిల్స్‌ ఫలితాల్లో 68వ ర్యాంకు సాధించారు. ఈయన తండ్రి గోవింద్‌రావు హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ కుమారుడిని చదివించారు. చైతన్య మొదటి నుంచి సివిల్స్ లక్ష్యంగా చదివి ర్యాంకు సాధించారు. మండలవాసి సివిల్స్ సాధించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

News April 22, 2025

ప్రతి వాహనాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి:  ADB SP

image

ప్రతి వాహనాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా పోలీసు అధికారుల వాహనాల డ్రైవర్లకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని సూచనలు చేశారు. ప్రతి వాహనంలో కెమెరాలు చేశామన్నారు. వాటిని సరైన విధంగా పద్ధతిలో ఉంచుకోవాలని తెలియజేశారు.

News April 22, 2025

ADB: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ఆమీనా షిరీన్

image

ఆర్టీసీ కార్మికుడి కూతురు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. ADB RTCలో రీజినల్ ఆన్లైన్ రిజర్వేషన్ ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ అహమ్మద్ హుస్సేన్ కూతురు ఆమీనా షిరీన్ సెకండియర్‌లో 99శాతం ఉత్తీర్ణత సాధించింది. బైపీసీ విభాగంలో 1000కి 990 మార్కులు సాధించింది. ఆమెకు కుటుంబ సభ్యులు, ఆర్టీసీ సిబ్బంది అభినందనలు తెలిపారు. మన ADB అమ్మాయికి CONGRATULATIONS చెప్పేయండి మరి.

error: Content is protected !!