News April 27, 2024
నార్నూర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ఇంద్రవెల్లి మండలం ధనోర(బి)లో నిన్న ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న నార్నూర్ మండలం చోర్గావ్కు చెందిన అడ మధుకర్, దుర్వ చందు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీరిని చికిత్స నిమిత్తం 108 ద్వారా రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ వారు ఇవాళ మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 24, 2025
ADB: వడ్డీ వ్యాపారులపై కొరడా జులిపిస్తున్న ఎస్పీ

జనాల రక్తాన్ని పిండి పీడిస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన కొరడా జలపిస్తున్నారు. ఆదిలాబాద్ వన్ టౌన్, టూ టౌన్, మావల, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్ ప్రాంతాలలో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 6 మండలాలలో 30 బృందాలతో ఆకస్మిక దాడులు చేశారు. అధిక వడ్డీ వసూలు చేసే వడ్డీ వ్యాపారులపై జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 కేసుల నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 23, 2025
MNCL: జిల్లాలో విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లక్షెట్టిపేటలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని సుస్మిత (16) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెంది ఉరేసుకుందన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 23, 2025
సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన ADB బిడ్డ

UPSC సివిల్స్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా యువకుడు ఆదా సందీప్ సత్తా చాటాడు. ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న వెంకటేష్-వాణి దంపతుల చిన్న కుమారుడు సందీప్ సివిల్స్ ఫలితాల్లో 667 ర్యాంక్ సాధించాడు. గతంలో తొలి ప్రయత్నంలో 830 ర్యాంక్ సాధించాడు. అదే పట్టుదలతో మళ్లీ పరీక్ష రాసి ఇప్పుడు 667 ర్యాంక్ సాధించడంతో కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సందీప్ను అభినందించారు.