News April 18, 2025

నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలి: మంత్రి దామోదర

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీల సంఖ్యను మరింత పెంచాలని అధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో వైద్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. సరైన కారణం లేకుండా సిజేరియన్ డెలివరీలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రమోషన్ల ద్వారా ఖాళీ అయిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Similar News

News April 19, 2025

పేరుపాలెం బీచ్‌లో గల్లంతైన యువకుడి మృతి

image

పేరుపాలెం బీచ్‌లో స్నానం చేస్తూ ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెంకు చెందిన సంకెళ్ల ఉదయ్ కిరణ్ (20) స్నానానికి వచ్చాడు. అలల ఉద్ధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. మృతదేహాన్ని నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరో యువకుడు భీమవరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

News April 19, 2025

రేపు జిల్లాకు రానున్న ఎంపీ మాగుంట

image

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకాశం జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మాగుంట కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించనున్న సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఎంపీ పాల్గొంటారు. 21వ తేదీన సాయంత్రం మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు.

News April 19, 2025

మేలో మరో ప్రయోగం చేపట్టనున్న ఇస్రో

image

మే నెల 22వ తేదీన ‘GSLV F-16’ రాకెట్ ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు చేస్తుంది. ఈ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన నిషార్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనుంది. ఇప్పటికే షార్‌లోని రెండవ ప్రయోగ వేదిక వద్దనున్న వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధాన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!