News April 22, 2025

నా జిల్లా మొదటి స్థానం: మంత్రి సీతక్క

image

ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో తన సొంత జిల్లా ములుగు మొదటి స్థానం, తాను ఇన్చార్జిగా ఉన్న ఆసిఫాబాద్ జిల్లా రెండవ స్థానంలో నిలవడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. వెనకబడిన గిరిజన ప్రాంతాలైన ఈ రెండు జిల్లాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటడం ఎంతో సంతోషంగా ఉందని, కలెక్టర్, డీఈఓలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు

Similar News

News December 19, 2025

గన్నవరంలో విమానాల రాకపోకలకు అంతరాయం

image

గన్నవరం ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఉదయం పొగమంచు తీవ్ర ప్రభావం చూపింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల రాకపోకలు అస్తవ్యస్తమయ్యాయి. హైదరాబాద్‌, ఢిల్లీ, చెన్నై నగరాల నుంచి రావాల్సిన విమానాలు ల్యాండింగ్‌ కావడానికి వీలులేకపోవడంతో గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాలు సకాలంలో చేరుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరికొన్ని సర్వీసులు రద్దైయ్యాయి.

News December 19, 2025

నిర్మల్: మొదటిలో దశ కాంగ్రెస్, రెండు, మూడు దశల్లో బీజేపీ

image

నిర్మల్ జిల్లాలో జరిగిన మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు BJP గట్టిపోటీ ఇచ్చింది. మొదటి విడతలో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక స్థానాలు దక్కించుకోగా.. 2, 3 విడలతో BJP మద్ధతుదారులు అధికంగా గెలిచారు. 399 GPల్లో 144 జీపీలు బీజేపీ, 137 కాంగ్రెస్, 24 బీఆర్ఎస్, 93 జీపీల్లో ఇండిపెండెంట్లు అభ్యర్థులు విజయం సాధిచారు. దీంతో నిర్మల్, ముథోల్ సెగ్మెంట్లలో బీజేపీ పుంజుకుంది.

News December 19, 2025

ఏలూరు జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్ల పొడిగింపు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రైలు నంబర్ 07615-16 హెచ్‌ఎస్ నాందేడ్-తిరుచరాపల్లి-హెచ్ఎస్ నాందెడ్ వరకు జనవరి6-28 వరకు పొడిగించారు. 07041-42 అనకాపల్లి-సికింద్రబాద్-అనకాపల్లికి JAN 26-FEB 16 వరకు రాకపోకలు సాగిస్తాయి. 07219-20 తిరువన్నామలై-నర్సపూర్-తిరువన్నమలైకు JAN29వ తేదీ వరకు నడవనున్నాయి.