News March 26, 2024

నా బాస్‌ KCR ఒక్కరే: పద్మారావు

image

సికింద్రాబాద్‌లో గెలవబోతున్నామని BRS MP అభ్యర్థి పద్మారావు జోస్యం చెప్పారు. తెలంగాణభవన్‌లో జరిగిన పార్లమెంటరీ సమావేశంలో‌ ఆయన మాట్లాడారు. ‘అప్పట్లో నా వద్ద బండి లేదు. కార్పొరేటర్‌ నుంచి పార్లమెంట్‌ స్థాయికి ఎదిగాను. నాది పొలిటికల్ ఫ్యామిలీ కాదు. నా నుంచే రాజకీయాలు మొదలయ్యాయి. నా బాస్ KCR ఒక్కరే. ఆయన వల్లే రాజకీయాల్లోకి వచ్చాను. ఈ MP ఎన్నికల్లోనూ గెలుస్తాను’ అంటూ పద్మారావు ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News September 29, 2024

HYD: మూసీ భాదితులను కన్న బిడ్డల్లా చూసుకుంటాం: మంత్రి

image

మూసి నిర్వాసితులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాళ్లను కాపాడే భాద్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సొంత నివాసం లేని వారికి ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, పేదలని కన్నబిడ్డల్లాగా చూసుకుంటామని అన్నారు. ప్రపంచంలోనే హైదరాబాద్‌ను బెస్ట్ సిటీగా నిర్మిస్తామని తెలిపారు.

News September 29, 2024

HYD: పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత..!

image

HYDలోని 691 ప్రభుత్వ పాఠశాలలో 1,12,650 మంది విద్యార్థులు ఉండగా.. వీరికి 4,265 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. RR, MDCL, VKB జిల్లాల పరిధిలో అనేక పాఠశాలలో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలేదు. 10వ తరగతి విద్యార్థులకు మరీ ఇబ్బందిగా మారింది. ఇకనైనా అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

News September 29, 2024

సికింద్రాబాద్: ప్రమాదాల నివారణకు రక్షణ కవచ్

image

సికింద్రాబాద్, కాచిగూడ సెక్షన్ ప్రాంతాల్లో రైల్వే ప్రమాదాల నివారణకు అధికారులు రక్షణ కవచ్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. దాదాపు 273 కిలోమీటర్ల పరిధిలో దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2019 నవంబర్ 11న కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒకదానికొక రైలు ఎదురుగా ఢీకొంది. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఈ రక్షణ చేస్తున్నట్లు తెలిపారు. రక్షణ కవచ్ యంత్రాలు దాదాపు 28 స్టేషన్లో ఏర్పాటు చేశారు.