News March 25, 2025
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి: డీకే అరుణ

హైదరాబాద్లో 23 ఏళ్ల యువతి వేధింపుల నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న ఎంఎంటీఎస్ రైలు నుంచి దూకి గాయాల పాలైందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నగరంలో మహిళల భద్రతను మెరుగుపరచాల్సిన తక్షణ అవసరాన్ని ఈ సంఘటన ఎత్తి చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
Similar News
News February 22, 2026
పెద్దవాళ్ల సబ్బునే పిల్లలకూ వాడుతున్నారా?

చిన్నపిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకే వారికి ఉపయోగించే ఉత్పత్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. చాలామంది పిల్లలకు తర్వాత పెద్దవాళ్ల సబ్బులే వాడుతుంటారు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. దీనివల్ల వారికి చిరాకు, అలర్జీ వచ్చే అవకాశముందంటున్నారు. పిల్లల ఉత్పత్తుల్లో పారబెన్స్, మినరల్ ఆయిల్స్, సల్ఫేట్స్ లేకుండా pH5.5% ఉండేలా చూసుకోవాలంటున్నారు.
News February 22, 2026
NIT దుర్గాపూర్లో ఉద్యోగాలు

NIT దుర్గాపూర్ 3 ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్(2), రీసెర్చ్ అసిస్టెంట్(1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 7 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ(సోషల్ సైన్స్), NET/M.Phil/PhD అర్హత ఉండాలి. రీసెర్చ్ అసిస్టెంట్కు నెలకు రూ.37,000, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కు రూ.20,000 చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://nitdgp.ac.in
News February 22, 2026
అష్టలక్ష్మి: ఆదిలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలంటే?

ఆదిలక్ష్మి అమ్మవారే ఈ సృష్టికి మూలం. ఎంతో శక్తిమంతమైన ఈ తల్లి స్వచ్ఛత, శాంతి, జ్ఞానానికి చిహ్నం. అందుకే ఆ మాతను పూజించేటప్పుడు తెలుపు రంగు వస్త్రం, పూలను సమర్పించడం శ్రేష్ఠం. తద్వారా మనస్సు నిర్మలంగా మారుతుంది. జీవితంలో ఎదురయ్యే గందరగోళం తొలగి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రతి పనిని ధర్మబద్ధంగా ప్రారంభించే శక్తి లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి, మనశ్శాంతికి ఆదిలక్ష్మి దేవి అనుగ్రహం చాలా అవసరం.


