News April 3, 2025
నిందితులకు శిక్షలు పడే విధంగా కృషి చేయాలి: ఎస్పీ మహేశ్

క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నిందితులకు శిక్షలు పడేలా కృషిచేయాలని సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బి గితే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం సబ్ డివిజన్ అధికారులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై దృష్టి సారించి కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News July 6, 2025
మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రత్యేక రైళ్లు.!

దక్షిణ మధ్య రైల్వే మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ మీదుగా ఈనెల 9 నుంచి సెప్టెంబర్ 25 మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 07717 (తిరుపతి- హుసూర్), 07718 (హుసూర్- తిరుపతి), 07653 (కాచిగూడ- తిరుపతి), 07654 (తిరుపతి- కాచిగూడ), 07219 (నరసాపూర్- తిరువన్నామలై), 07220 (తిరువన్నామలై- నరసాపూర్) ప్రత్యేక రైలు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
News July 6, 2025
స్కూళ్లకు కీలక ఆదేశాలు

AP: విద్యార్థులు 3 రోజులకు మించి స్కూళ్లకు రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. 5 రోజుల కంటే ఎక్కువ బడికి రాకపోతే MEO, CRPలు ఆ విద్యార్థి ఇంటికి వెళ్లాలని సూచించింది. టీచర్లు, విద్యార్థుల హాజరుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపింది. టీచర్లు సెలవు పెడితే వెంటనే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని అకడమిక్ పర్యవేక్షణ అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేసింది.
News July 6, 2025
పైసా పెట్టు.. కార్డు పట్టు.. జిల్లాల్లో ఇది పరిస్థితి.!

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సాగుతుంది. కాగా ఇదే అదునుగా భావించి ఇరు జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు రేషన్ కార్డు మంజూరు కోసం చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నూతన రేషన్ కార్డు మంజూరు కోసం రూ.2, 3 వేలు డిమాండ్ చేస్తున్నారని స్థానికులు తెలిపారు.