News February 2, 2026

నిజమైన కరుంగలి మాలను ఎలా గుర్తు పట్టాలి?

image

మార్కెట్లో నకిలీ మాలలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నిజమైన కరుంగలి పూసలు బరువుగా ఉంటాయి. నీటిలో వేస్తే వెంటనే మునిగిపోతాయి. నకిలీవి తేలుతాయి. నిజమైన పూసలు సహజమైన నలుపు రంగులో ఉంటాయి. తాకితే నునుపుగా, చల్లగా అనిపిస్తాయి. వీటిపై ఎటువంటి రంగు పూత ఉండదు. ఓ పూసను నీటిలో నానబెట్టినప్పుడు నీరు రంగు మారకూడదు. అసలైన కలప కాంతిని సహజంగా ప్రతిబింబించాలి.

Similar News

News February 17, 2026

రాగి పంటకు నీరు అందించడంలో జాగ్రత్తలు

image

రాగి పంటకు నీటిని అందించే విషయంలో రైతులు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. నాట్లు వేసిన రాగి పొలంలో పైరు బాగా వేర్లు తొడిగే వరకు అంటే సుమారు 10 రోజుల వరకు నీరు పెట్టకూడదని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రాగి పంట సాధారణంగా వర్షాధార పంట అయినప్పటికీ కీలక దశలైన మొలకెత్తే దశ, పూత, గింజ పాలు పోసుకునే దశల్లో నీటి తడులను ఇస్తే దిగుబడి బాగుంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.

News February 17, 2026

ఇన్‌కమ్ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో 46 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్, గుజరాత్‌ స్పోర్ట్స్ కోటాలో 46 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, టెన్త్ అర్హతతో పాటు క్రీడల్లో( జాతీయ, అంతర్జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ, ఖేలో ఇండియా ) పతకాలు సాధించినవారు FEB 21 వరకు అప్లై చేసుకోవచ్చు. MTS పోస్టులకు 18-25ఏళ్ల మధ్య, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు 18-27ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: incometaxgujarat.gov.in

News February 17, 2026

$100 బిలియన్లతో అదానీ ఏఐ డేటా సెంటర్లు

image

దేశంలో పర్యావరణహిత AI డేటా సెంటర్ల నిర్మాణానికి 100 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. 2035లోగా నేరుగా $100బిలియన్లు, సంబంధిత రంగాల కోసం మరో $150 బిలియన్లు వెచ్చించనుంది. సర్వర్ మాన్యుఫ్యాక్చరింగ్, సావరిన్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్, సెమీకండక్టర్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తంగా ఈ పెట్టుబడుల ద్వారా పదేళ్లలో $250 బిలియన్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ కాబోతోంది.