News August 24, 2025

నిజాంపేటలో అనుమానాస్పదంగా మహిళ సూసైడ్

image

నిజాంపేటలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో ఉరేసుకున్న ఘటన శనివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన బొంబాయి రాజవ్వ(50) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుందని గ్రామస్థులు తెలిపారు. అయితే ఆమె సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Similar News

News August 24, 2025

MDK: స్వాతంత్ర్య సమర యోధుడు మృతి

image

స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న అల్లాదుర్గం ప్రాంతానికి చెందిన మజ్జిగ ఈశ్వరయ్య (96) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా ఇంట్లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఏది ఏమైనా స్వాతంత్ర్య సంగ్రామ యోధుడిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు.

News August 24, 2025

‘మెతుకు సీమలో కనుమరుగవుతున్న కళలు’

image

ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా పల్లెలు ప్రజల సంస్కృతి, జీవన విధానాన్ని ప్రతిబింబించిన జానపదాలు నేడు కనుమరుగైపోయాయి. చెక్కభజనలు, గంగిరెద్దులాటలు ఇప్పుడు చాలా అరుదయ్యాయి. సంక్రాంతి పండుగకు కనిపించే హరిదాసుల గేయాలు, ఒగ్గు కథలు, బొంగురోల ఆటలు కూడా కనుమరుగయ్యాయి. ఆధునిక పరిజ్ఞానం పెరిగిన కొలది పాత జ్ఞాపకాలు తొలగిపోతాయని కొందరూ చర్చించుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్..!

News August 24, 2025

మెదక్: ‘వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి’

image

సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మెదక్ వైద్యాధికారి డా. శ్రీరామ్ అన్నారు. పాపన్నపేట PHCని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులు, రోగులకు మందుల పంపిణీ గురించి ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో చందర్, క్రాంతి, శారద తదితరులు పాల్గొన్నారు.