News March 12, 2025

నిజాంపేట: వెంకటేశ్‌కు రాష్ట్రపతి చేతులమీదుగా బంగారు పతకం

image

మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్‌కు చెందిన గోపిక వెంకటేశ్ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు. ఉన్నత చదువులకు హర్యానా హిసార్ గురు జంబీశ్వర విశ్వవిద్యాలయం నుంచి ప్రింటింగ్, ప్యాకేజ్ ప్యాకేజ్‌లో ప్రతిభ కనబరిచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Similar News

News March 12, 2025

మెదక్: హోలీ పండుగ సంతోషంగా జరుపుకోవాలి: ఎస్పీ

image

హోలీ పండుగను కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. మెదక్ జిల్లా ప్రజలకు హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో సంస్కృతి అద్దం పట్టేలా జరుపుకోవాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపి జరిమానాలకు, రోడ్డు ప్రమాదాలకు గురై జైలు పాలు కావద్దని సూచించారు. హోలీ పండగ వేళ మన తోటి ఆడపడుచులతో గౌరవప్రదంగా నడుచుకోవాలని తెలిపారు.

News March 12, 2025

కౌడిపల్లి: ఈనెల 17 నుంచి తునికి నల్ల పోచమ్మ జాతర

image

కౌడిపల్లి మండలం తునికి నల్ల పోచమ్మ దేవస్థానం జాతర ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈనెల 17 నుంచి 20 వరకు నాలుగు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి దేవదాయ ధర్మాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 17న ధ్వజారోహణం, అభిషేకం, గణపతి పూజ, 18న అగ్నిగుండాలు, బోనాలు, 19న బండ్లు తిరుగుట, 20న పాచి బండ్లు, పల్లకీ సేవ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.ఈ జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

News March 12, 2025

మెదక్: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

image

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికీ ప్రమాదముంది. సంగారెడ్డిలో గాలినాణ్యత విలువ 124గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!

error: Content is protected !!