News March 15, 2025

నిజాంసాగర్: గ్రామస్థుల సహకారం అవసరం: కలెక్టర్

image

పాఠశాలల అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. నిజాంసాగర్ మండలం అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ ఆధారిత ఎఫ్‌ఎల్‌ఎన్ ల్యాబ్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన తల్లిదండ్రులకు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌ఎల్‌ఎన్ ల్యాబ్ విద్యార్థులకు సులభంగా మౌలిక భాషా గణిత సామర్ధ్యాలను సాధించడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 

Similar News

News March 15, 2025

నిజామాబాద్: ఇంటర్ పరీక్షల్లో 364 మంది విద్యార్థులు గైర్హాజరు

image

నిజామాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్ రెండవ సంవత్సరం మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ-2 పరీక్షకు మొత్తం 364 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 14,472 మంది విద్యార్థులకు 14,108 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని అధికారులు వివరించారు.

News March 15, 2025

నంద్యాల తాగునీటి సరఫరాపై ఉన్నత స్థాయి సమీక్ష

image

నంద్యాల జిల్లాలో తాగునీటి సరఫరాపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించారు. కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వేసవి ముంచుకొస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్యపై జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News March 15, 2025

తూ.గో జిల్లా ప్రజలకు గమనిక

image

వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లపై తూ.గో జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్.సురేశ్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర, జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాలను పరిశీలించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చామన్నారు. ఇకపై ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సర్టిఫికెట్లు మంజూరు చేస్తామన్నారు. జిల్లాలోని ప్రజలు రాజానగరంలోని కంట్రోల్ అల్ట్ ఫిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను సంప్రదించి సర్టిఫికెట్లు తీసుకోవాలన్నారు.

error: Content is protected !!