News March 29, 2025

నిజాంసాగర్: చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి మృతి

image

మద్యానికి బానిసై చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లి గ్రామానికి చెందిన గుల బాలకృష్ణయ్య మద్యానికి బానిస అయ్యాడు. ఆరోగ్యం బాగా లేక వడ్డేపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Similar News

News March 31, 2025

‘ఎంపురాన్’పై తమిళనాట వివాదం.. రైతుల ధర్నా

image

మోహన్‌లాల్ ‘ఎంపురాన్’ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఆ మూవీలో ముళ్లై పెరియార్ డ్యామ్‌ గురించి తీసిన సన్నివేశాల్ని తొలగించాలని తమిళనాడు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సినిమాపై నిరసనగా వచ్చే నెల 2న కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ధర్నాలు చేపడతామని ప్రకటించాయి. కాగా.. ఓ వర్గాన్ని కించపరిచేలా కొన్ని సీన్స్ ఉన్నాయంటూ ఇప్పటికే ఆ సినిమాపై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.

News March 31, 2025

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన రంజాన్ : VZM SP

image

విజయనగరం జిల్లాలో రంజాన్ పండగ హిందూ – ముస్లిం సోదరుల మధ్య సోదర భావం పెల్లుబికి, పండగలో ఎటువంటి మత విద్వేషాలు, సంఘర్షలు, అల్లర్లు జరగకుండా ప్రశాంతయుతంగా ముగిసినట్లుగా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినాన జిల్లాలో ఎటువంటి మత ఘర్షణలు తలెత్తకుండా జిల్లా పోలీసుశాఖ చేపట్టిన ముందస్తు భద్రత చర్యలు సత్ఫలితాలనిచ్చాయని అన్నారు.

News March 31, 2025

అమలాపురం: రేపు యధావిధిగా సోషల్ పరీక్ష: డీఈవో 

image

పదవ తరగతి సోషల్ పరీక్ష మంగళవారం యధావిధిగా జరుగుతుందని అంబేడ్కర్ కోనసీమ డీఈవో సలీం భాషా సోమవారం తెలిపారు. ఒకటవ తేదీ సోమవారం ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తూ జీవో జారీ చేసిందన్నారు. కావున రేపు జరగాల్సిన సోషల్ పరీక్ష యధావిధిగా జరుగుతుందని చెప్పారు. జిల్లాలోని డివైఈవోలు, ఎంఈవోలు, జడ్పీహెచ్ స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. విద్యార్థులందరికీ విషయం తెలియపరచాలన్నారు.

error: Content is protected !!