News March 29, 2025

నిజాంసాగర్: చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి మృతి

image

మద్యానికి బానిసై చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లి గ్రామానికి చెందిన గుల బాలకృష్ణయ్య మద్యానికి బానిస అయ్యాడు. ఆరోగ్యం బాగా లేక వడ్డేపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Similar News

News February 27, 2026

TU: ఎల్ఎల్‌బీ 5వ సెమిస్టర్ పరీక్షలు.. ఒకరు గైర్హాజరు

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎల్ఎల్‌బీ ఐదో సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా కొనసాగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 28 మంది విద్యార్థులకు 27 మంది హాజరుకాగా ఒక్కరు గైర్హాజరైనట్లు వెల్లడించారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదని తెలిపారు.

News February 27, 2026

DRDOలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

బెంగళూరులోని <>DRDO<<>>కు ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ 8 రీసెర్చ్ అసోసియేట్, JRF పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. PhD, ME/MTech, BE/BTech, GATE స్కోరు ఉన్నవారు మార్చి 4 నుంచి 24 వరకు e- మెయిల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. RAకు నెలకు రూ.67,000, JRFకు రూ.37,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/

News February 27, 2026

వర్షాకాలానికి ముందే మేడిగడ్డ మరమ్మతులు

image

TG: మేడిగడ్డ బ్యారేజీని మరమ్మతు చేసి వినియోగంలోకి తెస్తామని CM రేవంత్ ప్రకటించడం తెలిసిందే. ఆ దిశగా అధికారులు డిజైన్లు రెడీ చేస్తున్నారు. దాదాపు ₹500CRకు పైగా ఖర్చవుతుందని అంచనా. ఖర్చు GOVT భరించాలని L&T అంటుండగా, ఆ సంస్థే భరించాలని అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి. వర్షాకాలానికి ముందే APRలో పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీ రిపేర్లూ చేయిస్తారు.