News February 1, 2025
నిజాంసాగర్ ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల

నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా మూడో విడత నీటిని శుక్రవారం విడుదల చేశారు. ఆయకట్టు కింద సాగవుతున్న 1.35 లక్షల ఎకరాల్లో పంటల సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 1300 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ ఏఈ శివకుమార్ తెలిపారు. రెండో విడతలో ఇప్పటి వరకు 3.84 టీఎంసీల నీటిని విడుదల చేశామని చెప్పారు. మూడో విడతలో 15 రోజుల పాటు నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
Similar News
News November 7, 2025
ఓపిక ఉండట్లేదా?

వాతావరణ మార్పులు, వేళకి తినకపోవడం, ఇంటా బయటా పనంటూ ఉరుకులు పరుగుల వల్ల చాలామంది మహిళలు తరచూ నీరసపడిపోతూ ఉంటారు. తగినంత విశ్రాంతి లేకపోతే శరీరం మాత్రం కోలుకోదు. కాబట్టి విశ్రాంతి తప్పనిసరి. రోజూ మీ ఆహారంలో పప్పుధాన్యాలు, గింజలను తప్పనిసరి చేసుకోండి. తేలికపాటి వ్యాయామాల్నీ దినచర్యలో తప్పక భాగం చేసుకోవాలి. పనంతా పూర్తయ్యాక తప్పదు కాబట్టి నిద్ర అన్నట్లుగా కాక ఒక సమయాన్ని నిర్దేశించుకోండి.
News November 7, 2025
శుక్రవారం ఈ పని చేయకూడదా..?

శుక్రవారం రోజున దేవతా విగ్రహాలు, పటాలు, పూజా సామాగ్రిని శుభ్రం చేయడం అస్సలు మంచిది కాదని పండితులు చెబుతారు. ‘శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున ఇలాంటి కార్యాలు చేపడితే ఆ దేవత ఆగ్రహించే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ఈ పనులు కారణమవుతాయి. అందుకే శుక్రవారం రోజున ఇలా చేయకూడదు. దేవుడి విగ్రహాలు, పటాల శుభ్రతకు బుధ, గురు, ఆది, సోమవారాలు అనుకూలం’ అని అంటారు.
News November 7, 2025
నేడు స్పీకర్ విచారణకు జగదీశ్ రెడ్డి, సంజయ్

TG: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మలిదశ విచారణ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇవాళ స్పీకర్ ప్రసాద్ సమక్షంలో పోచారం శ్రీనివాసరెడ్డి తరఫు న్యాయవాదులు జగదీశ్ రెడ్డిని, అరెకపూడి గాంధీ తరఫు లాయర్లు కల్వకుంట్ల సంజయ్ను ప్రశ్నించనున్నారు. నిన్న స్పీకర్ సమక్షంలో జగిత్యాల MLA సంజయ్పై ఫిర్యాదు చేసిన జగదీశ్ రెడ్డిని, వెంకట్రావ్పై ఫిర్యాదు చేసిన వివేకానందను ఆధారాలకు సంబంధించి లాయర్లు క్రాస్ ఎగ్జామిన్ చేశారు.


