News October 10, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టు 5 గేట్ల నుంచి నీటి విడుదల

నిజాంసాగర్ ప్రాజెక్టుకు మళ్లీ వరద ఉద్ధృతి పెరిగింది. శుక్రవారం ఉదయం 41,680 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు 5 వరద గేట్లను ఎత్తి 40,680 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.802 టీఎంసీలతో నిండుకుండలా మారింది. మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు ప్రధాన కాలువకు విడుదల కొనసాగుతోంది.
Similar News
News October 10, 2025
ఈ ప్లేయర్లను రిలీజ్ చేయనున్న CSK!

IPL-2026కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ పలువురు ప్లేయర్లను <<17966400>>రిలీజ్<<>> చేయవచ్చని Cricbuzz తెలిపింది. దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, సామ్ కరన్, కాన్వేలను వదులుకునే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇప్పటికే అశ్విన్ రిటైర్ కావడంతో చెన్నై పర్సులో రూ.9.75 కోట్లు యాడ్ అయ్యాయి. అటు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ సహా శ్రీలంక స్పిన్నర్లు హసరంగ, మహీశ్ తీక్షణలను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.
News October 10, 2025
మోహన్ బాబు వర్సిటీకి ఊరట

AP: <<17943028>>MB వర్సిటీకి<<>> హైకోర్టులో ఊరట దక్కింది. నిబంధనల ఉల్లంఘనతో దీని గుర్తింపు రద్దు, ₹26.17 కోట్ల అదనపు ఫీజు రిఫండ్ కోసం ఇటీవల APSCHE ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనిపై వర్సిటీ కోర్టును ఆశ్రయించగా స్టే విధించింది. ADMIN బాధ్యతల్ని SVUకి అప్పగించాలన్న ఉత్తర్వునూ నిలిపివేసింది. ఆదేశాలిచ్చినా సిఫార్సులను వెబ్సైట్లో అప్లోడ్ చేయడంపై APSCHEని ప్రశ్నించింది. తమ ఉత్తర్వులు అప్లోడ్ చేయాలని ఆదేశించింది.
News October 10, 2025
అసలైన భక్తికి నిదర్శనం మయూరధ్వజుని త్యాగం

నిజాయితీ, భక్తితో సేవించేవారికి భగవంతుడు ప్రత్యక్షమవుతాడు అనడానికి మయూరధ్వజుని కథే నిదర్శనం. శ్రీకృష్ణుడు ఇచ్చిన పరీక్షలో తన భక్తిని నిరూపించుకోవడానికి ఆయన తన కుమారుడిని సగంగా కోసి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అతిథి రూపంలో వచ్చిన భగవంతుడిని సంతృప్తి పరచడమే ఆయన ధర్మంగా భావించాడు. అలాంటి గొప్ప ఆత్మత్యాగానికి ముగ్ధుడైన శ్రీకృష్ణుడు, వెంటనే ఆయనకు సాక్షాత్కారం ఇచ్చి, శుభాన్ని కలిగించాడు. <<-se>>#Bakthi<<>>