News August 28, 2025
నిజాంసాగర్: 27 గేట్లు ఎత్తి.. 2.20 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. గురువారం రాత్రి 8 గంటలకు 1,80,038 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 27 గేట్లను ఎత్తి 2,20,256 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 17.802 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 15.847 టీఎంసీలకు చేరింది. నీటి ప్రవాహం పెరిగినందున ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Similar News
News August 29, 2025
క్వార్టర్ ఫైనల్స్లో భారత ప్లేయర్లు

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో భారత ప్లేయర్లు అదరగొట్టారు. మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్లో వరల్డ్ నం.2 వాంగ్(చైనా)పై సింధు వరుస సెట్లలో 21-19, 21-15 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. మెన్స్ డబుల్స్లో చిరాగ్, సాత్విక్ ద్వయం చైనా జోడీ లియాంగ్, వాంగ్ చాంగ్పై జయకేతనం ఎగురవేశారు. మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్, తనీశా క్వార్టర్స్ దూసుకెళ్లారు. మరోవైపు రౌండ్-2లోనే లక్ష్యసేన్ పోరు ముగిసింది.
News August 29, 2025
క్రీడా ప్రపంచానికే హైదరాబాద్ వేదిక కావాలి: రేవంత్

తెలంగాణకు ఐటీ సంస్కృతి ఉన్నట్లుగానే క్రీడా సంస్కృతి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదిక కావాలని స్పోర్ట్స్ హబ్ బోర్డ్ <<17546114>>సమావేశంలో<<>> అన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తాము క్రీడా రంగానికి బడ్జెట్ 16 రెట్లు పెంచామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఆటగాళ్లకు ప్రోత్సాహాకాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
News August 29, 2025
వరంగల్: ఇంటర్ పూర్తి చేసిన వారికి శుభవార్త

HCL టెక్నాలజీస్ ఆధ్వర్యంలో HCL TECH Bee జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వరంగల్ DIEO డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. 2024-2025లో ఇంటర్ పూర్తి చేసుకున్న వారు MPC, MEC, CEC, BIPC, Vocational Computers పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 30వ తేదీన హనుమకొండలోని ICSS కంప్యూటర్ ఎడ్యుకేషన్లో జాబ్ మేళా ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.