News July 20, 2024

నిజాంసాగర్ JNVలో ప్రవేశాలు

image

నిజాంసాగర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ సత్యవతి తెలిపారు. 01.05.2013 నుంచి 31.7.2015 సంవత్సరాల మధ్యలో జన్మించి 5వ తరగతి పాసైన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని కోరారు.

Similar News

News August 16, 2025

ALERT.. గోదావరి పరీవాహక ప్రజలకు హెచ్చరిక

image

కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలో భారీగా వరద నీరు పెరిగే అవకాశం ఉన్నందున గోదావరి నదీ పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోచంపాడ్ డ్యామ్ సైట్ EE M.చక్రపాణి హెచ్చరించారు. పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు, సామాన్య ప్రజలు గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని ఆయన సూచించారు.

News August 15, 2025

NZB: దారుణం.. కన్న కూతురిపైనే అత్యాచారాయత్నం

image

నవీపేట్ మండలంలో దారుణం జరిగింది. ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కన్నకూతురి పైనే లైంగిక దాడికి యత్నించాడు. గ్రామస్థుల కథనం ప్రకారం.. మద్యానికి బానిసైన అతడు కొంతకాలంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో 11 ఏళ్ల కూతురికి ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూపుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని ఇటీవల తల్లి దృష్టికి తీసుకెళ్లగా బంధువులకు చెప్పి పంచాయతీ పెట్టారు. విషయం నిన్న పోలీసులకు చేరగా వారు దర్యాప్తు చేస్తున్నారు.

News August 15, 2025

WOW.. మువ్వన్నెల రంగుల్లో మెరిసిన SRSP

image

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టు మూడు రంగుల్లో మెరిసిపోతోంది. ప్రాజెక్టును అధికారులు త్రివర్ణ పతాకం రంగుల్లో అలరారేలా చేయగా ప్రజలు దానిని చూసేందుకు బారులు తీరారు. చూసేందుకు కన్నుల పండువగా ఉండగా నిత్యం ఇలా లైటింగ్‌తో ఉంచితే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.