News March 28, 2024
నిజామాబాదీలు జర జాగ్రత్త..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రత 40 సెల్సియస్ డిగ్రీలు దాటుతోంది. నిన్న బుధవారం అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోని ముగ్పాల్ మండలం మంచిప్పలో 42.2, నిజామాబాద్ లో 41.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా కామారెడ్డి జిల్లాలోని బిచ్కుందలో 40.9, తాడ్వాయిలో 39.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మున్ముందు ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది.
Similar News
News September 7, 2025
నిజామాబాద్లో చంద్రగ్రహణం

నిజామాబాద్లో ఆదివారం రాత్రి చంద్రగ్రహణం కనిపించింది. రాత్రి 8:58 గంటలకు పెనుమంట్ర దశతో ప్రారంభమైంది. పాక్షిక గ్రహణం రాత్రి 9:57 గంటలకు మొదలైంది. సంపూర్ణ గ్రహణం 12:22 గంటలకు ముగుస్తుంది. మొత్తం గ్రహణం తెల్లవారుజామున 2:25 గంటలకు ముగుస్తుందని జ్యోతిష పండితులు తెలిపారు.
News September 7, 2025
నిజామాబాద్: SRSP 8 వరద గేట్ల ఓపెన్

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ఆదివారం రాత్రి ప్రాజెక్టు 8 స్పిల్వే వరద గేట్లను ఓపెన్ చేశారు. వాటి ద్వారా 25 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడిచిపెట్టారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 52,840 క్యూసెక్కుల నీరు వస్తుండగా వరద గేట్లు, ఇతర కాల్వల ద్వారా 53,685 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
News September 7, 2025
నిజామాబాద్: బాస్కెట్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శిగా బొబ్బిలి నరేష్

జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు బొబ్బిలి నరేష్ బాస్కెట్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన సుదీర్ఘ కాలం పాటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా సేవలందించాడు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన్ను ఎన్నుకున్నారు. 30 ఏళ్లుగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో సేవలు అందించడంతో ఈ అవకాశం వచ్చిందన్నారు. ఆయన్ను పలువురు అభినందించారు.