News April 4, 2025
నిజామాబాద్లో ముస్లింల నిరసన

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై నిజామాబాద్ నగరంలోని నెహ్రూపార్క్ వద్ద ముస్లింలు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీసుకొచ్చి ముస్లింల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏసీపీ(ACP) రాజా వెంకట్ రెడ్డి, 1వ టౌన్ (SHO) రఘుపతి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పారు.
Similar News
News February 5, 2026
NZB: మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ కసరత్తు..!

నిజామాబాద్ మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో దానిని దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ నుంచి 19వ డివిజన్లో పోటీ చేస్తున్న కాటిపల్లి శమంత, బీజేపీ నుండి 6వ వార్డులో పోటీ చేస్తున్న గోపిడి స్రవంతి రెడ్డి మేయర్ పదవీని ఆశిస్తున్నట్లు సమాచారం.
News February 5, 2026
NZB: విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

జక్రాన్పల్లి మండలంలో విద్యుత్ షాక్కు గురై వంశీకృష్ణ (30) అనే వ్యక్తి మృతి చెందాడు. SI మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ మండలం గోవింద్పేట్కు చెందిన వంశీకృష్ణ బైక్ పై మాక్లూర్లోని ముత్యంపల్లెలో గల తన భార్య వద్దకు వెళుతున్నాడు. మార్గమధ్యలో రాత్రి దారి తప్పిపోయి సికింద్రాపూర్ రంగనాయక గుట్ట వద్ద తిరుగుతుండగా జొన్న తోటకు అడవి పందుల కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ తీగల తగిలి మృతి చెందాడు.
News February 4, 2026
NZB: ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై NZB జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష జరిపారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలను మరోమారు క్షేత్రస్థాయిలో సరి చూసుకోవాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలు, లోటుపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమీక్షలో డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.


