News November 17, 2025

నిజామాబాద్ అమ్మాయికి ‘బాలరత్న-2025’ అవార్డు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన తేలి విభశ్రీ ‘మల్టిపుల్ టాలెంట్ గర్ల్’, ‘బాలరత్న – 2025’ అవార్డులను అందుకుంది. కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న విభ శ్రీ.. శాస్త్రీయ నృత్యం, వెస్ట్రన్, ఫోక్ పాటలు, పలు టీవీ షోలు, చలనచిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సినీనటి ట్వింకిల్ కపూర్ చేతుల మీదుగా ఈ బాలకళాకారిణి అవార్డును స్వీకరించింది.

Similar News

News November 17, 2025

నంద్యాల: ‘కొనుగోలు కేంద్రాలపై స్పష్టత ఇవ్వాలి’

image

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు, జిల్లా కార్యదర్శి రామచంద్రుడు డిమాండ్‌ చేశారు. సోమవారం నంద్యాలలో కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధరల అమలు, పంట నష్టపరిహారం చెల్లింపు, ఎన్యూమరేషన్‌లో లోపాలను సవరించాలని కోరారు. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

News November 17, 2025

నంద్యాల: ‘కొనుగోలు కేంద్రాలపై స్పష్టత ఇవ్వాలి’

image

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు, జిల్లా కార్యదర్శి రామచంద్రుడు డిమాండ్‌ చేశారు. సోమవారం నంద్యాలలో కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధరల అమలు, పంట నష్టపరిహారం చెల్లింపు, ఎన్యూమరేషన్‌లో లోపాలను సవరించాలని కోరారు. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

News November 17, 2025

66 ఏళ్ల రికార్డు.. ఇండియాలో ఫస్ట్ టైమ్ నమోదు!

image

నిన్న దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమ్ ఇండియాకు అనూహ్య <<18303459>>ఓటమి<<>> ఎదురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ కొత్త రికార్డు నమోదైంది. భారత్‌లో ఇప్పటివరకు జరిగిన టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్సులు పూర్తయి కనీసం ఒక్కదాంట్లోనూ 200కు పైగా పరుగులు చేయకపోవడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా టెస్టుల్లో 12 సార్లు ఇలా జరిగింది. చివరిసారిగా 66 ఏళ్ల క్రితం ఈ తరహా రికార్డు నమోదైంది.