News March 25, 2024
నిజామాబాద్: అమ్మాయి కోసం యువకుల గొడవ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711334051434-normal-WIFI.webp)
ఓ అమ్మాయి విషయమై ఓ యువకుడిపై మరో యువకుడు దాడి చేసిన ఘటన HYDఅమీర్పేట్ మెట్రోస్టేషన్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్ వాసులు నితిన్, ఓ యువతి ప్రేమించుకోగా రెండేళ్ల తర్వాత పెళ్లి చేస్తామని కుటుంబీకులు చెప్పారు. దీంతో యువతి HYD వెళ్లింది. అక్కడ పంజాగుట్ట వాసి బాబీ ఆమెకు పరిచయమవగా అతడిని ప్రేమించింది. ఆమె ఫోన్లో వాట్సాప్ చాట్ చూసిన బాబీ నితిన్ను పిలిపించి దాడి చేశాడు.
Similar News
News July 8, 2024
నిజామాబాద్: అగ్నివీర్లో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720401004551-normal-WIFI.webp)
భారత వాయుసేన అగ్నిపథ్లో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ఉపాధి అధికారి సిరిమల్ల శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన యువతీ యువకులు జులై 8 నుంచి జులై 28 వరకు https://agnipathvayu.cdac.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
News July 8, 2024
KMR: రేషన్ కార్డుల్లో పేర్ల నమోదుకు అవకాశం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720399921806-normal-WIFI.webp)
రేషన్ కార్డుల్లో చిరునామా మార్పులు, కొత్త సభ్యుల పేర్ల నమోదుకు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మీ సేవ జిల్లా మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రెండు రోజుల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజలకు సూచించారు. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News July 8, 2024
నిజామాబాద్ జిల్లాలో డేంజర్ బెల్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720402461452-normal-WIFI.webp)
NZB జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గత 6 నెలల నుంచి 134 కేసులు నమోదవ్వగా కేవలం జూన్లోనే మెడికల్ ఆఫీసర్లు 9 కేసులు గుర్తించారు. వైరల్ ఫీవర్, డయేరియా, టైఫాయిడ్ వ్యాధులు ప్రజలను కుదిపేస్తున్నాయి. సర్కారు ఆస్పత్రుల్లో జూన్ నుంచి డయేరియా 263,37, టైఫాయిడ్, 467 వైరల్ ఫీవర్ కేసులను గుర్తించి ట్రీట్మెంట్ ఇచ్చారు. దీంతో అంగన్వాడీ, ఆశావర్కర్లను స్థానిక అధికారులను అలర్ట్ చేసింది.