News July 21, 2024

నిజామాబాద్: ఆరు నెలల్లో నలుగురు చిన్నారుల కిడ్నాప్

image

జిల్లాలో చిన్నారుల కిడ్నాప్‌లు కలకలం రేపుతున్నాయి. తాజాగా NZB GGHలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. కాగా జనవరి 30న మాలపల్లికి చెందిన ఏడేళ్ల బాలుడిని ఎత్తుకెళ్లి HYDలో విక్రయించేందుకు చూశారు. ఫిబ్రవరిలో ఆర్మూర్ బస్టాండ్‌లో ఓ మహిళ ఏడేళ్ల బాలుడిని, అదే నెల 4న నగర శివారులో ఓ దంపతులు రెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారు. అయితే ఈ కేసులను పోలీసులు ఛేదించి చిన్నారులను కాపాడారు.

Similar News

News October 7, 2024

నసురుల్లాబాద్: గుండెపోటుతో యువతి మృతి

image

కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం సంగెం గ్రామానికి చెందిన డేగావత్ బీనా (19) గుండెపోటుతో మృతి చెందింది. ఉన్నట్టుండి డెగావత్ బీనాకు ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందిందని స్థానికులు తెలిపారు. యువతి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. గతంలో మృతురాలు బీనా తాత కూడా గుండెపోటుతో మరణించాడు.

News October 7, 2024

కామారెడ్డి: మూడు ఉద్యోగాలు వద్దని లేఖ

image

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అరుణ మూడు ఉద్యోగాలను వదులుకున్నారు. 2018లో TGT, PGT ఉద్యోగాలు రాగా, 2019లో JLగా ఎంపికై విధుల్లో చేరారు. అనంతరం DL ఉద్యోగం రావడంతో JL ఉద్యోగం వదులుకున్నారు. తాజాగా DSCలో ర్యాంకు సాధించారు. అరుణ తాను సాధించిన 5 ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలకు నాట్ విల్లింగ్ లేఖను డీఈఓకు అందజేసింది. లెటర్ ఇవ్వడం వల్ల ఉద్యోగాలు ఇతరులకు వచ్చే అవకాశం ఉంది అని అన్నారు.

News October 7, 2024

మోస్రా: చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

image

చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మోస్రా మండలానికి చెందిన సాయిలు(46) అప్పులు తీసుకున్నాడు. కాగా, అవి ఎలా తీర్చాలో అర్థం అవ్వక మానసింకంగా కుంగిపోయేవాడు. ఈ క్రమంలో మనస్తాపం చెంది చెరువులో దూకి సూసైడ్ చేసుకునట్లు తెలిపారు.తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.