News August 10, 2025

నిజామాబాద్ ఐటీఐలో వాక్-ఇన్ అడ్మిషన్లు

image

NZB ప్రభుత్వ ITI/ATC, ప్రైవేట్ ITIలలో ప్రత్యక్ష ప్రవేశాలు (వాక్-ఇన్) నిర్వహిస్తున్నట్లు ITI కళాశాల ప్రిన్సిపల్ యాదగిరి తెలిపారు. ఈనెల 28 వరకు ఈ ప్రవేశాలు ఉంటాయని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోనివారు కూడా అదే రోజు దరఖాస్తు చేసుకుని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకుని అడ్మిషన్ పొందవచ్చని ఆయన చెప్పారు. 1,2 దశ అడ్మిషన్లలో సీట్లు పొంది ఇంకా రిపోర్ట్ చేయనివారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

Similar News

News September 9, 2025

గిరిజనులకు సౌర గిరి జల వికాసం పథకం: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

image

గిరిజనులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించిందని, అర్హులైన పోడు పట్టాదారులను గుర్తించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈ పథకం అమలుపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ పథకం అమలు కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో 15 మండలాల్లో పోడు భూములకు పట్టాలు అందించినట్లు తెలిపారు.

News September 9, 2025

ఉపరాష్ట్రపతి ఎన్నిక: ఓటేసిన ఎంపీ అర్వింద్

image

ఉపరాష్ట్రపతి ఎన్నికకు మంగళవారం ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో MP అర్వింద్ ధర్మపురి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ భవనంలోని ‘F-101 వసుధ’లో రహస్య బ్యాలెట్ విధానంలో ఆయన ఓటేశారు.

News September 9, 2025

NZB: చేపలు పట్టేందుకు వెళ్లి.. చెరువులో పడి మృతి

image

సిరికొండ మండలం కొండాపూర్ గోప్య తండా పరిధిలోని గంటతాండలో విషాదం నెలకొంది. చేపలు పట్టేందుకు చెరువుకు వెళ్లిన శంకర్ (60) చెరువులో పడి మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ చేపల వేటకు వెళ్లాడు. చాలా సేపటి వరకు తిరిగి రాకపోవడంతో వెతకగా, అతని మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.