News January 11, 2026
నిజామాబాద్: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు సాయి ప్రసన్న

జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారిని సాయి ప్రసన్న ఎంపికైంది. సబ్ జూనియర్ 32 కేజీల విభాగంలో రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించడంతో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు అసోసియేషన్ కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ నెల 13 నుంచి 15 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ పోటీల్లో సాయి ప్రసన్న పాల్గొననుంది.
Similar News
News February 11, 2026
NZB: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

నిజామాబాద్ నాగారం సమీపంలో నందిగుట్ట వద్ద ఉన్న చెరువు సమీపంలో బుధవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు 5వ టౌన్ పోలీస్ స్టేషన్ SI ఎం.గంగాధర్ తెలిపారు. సుమారు 35-40 ఏళ్ల వ్యక్తి తామర పూల కోసం చెరువులోకి వెళ్లి మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించలేదన్నారు. మృతుడిని గుర్తిస్తే 8712659727 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు.
News February 11, 2026
NZB: మధ్యాహ్నం 3 గంటల వరకు 48.55 శాతం పోలింగ్

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటల వరకు 48.55 శాతం పోలింగ్ నమోదైంది. NZB కార్పొరేషన్ లో 43.18శాతం, ఆర్మూర్ మున్సిపాలిటిలో 60.05 శాతం, బోధన్లో 61.77 శాతం, భీమ్గల్ మున్సిపాలిటీలో 63.65 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో 4,95,485 మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకు 2,40,543 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.
News February 11, 2026
NZB: వృద్ధుడికి సాయం చేసిన పోలీస్ బాస్

ప్రజాస్వామ్య పండుగలో ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధుడికి జిల్లా పోలీస్ బాస్ అండగా నిలిచారు. బుధవారం నిజామాబాద్లో పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్న క్రమంలో సీపీ పి.సాయి చైతన్య తనలోని మానవీయ కోణాన్ని చాటుకున్నారు. చంద్రశేఖర్ కాలనీలోని పోలింగ్ కేంద్రం వద్ద నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని చూసిన ఆయన స్వయంగా వీల్ ఛైర్ను నెట్టుకుంటూ వెళ్లి సదరు వృద్ధుడు ఓటు వేయడానికి సహకరించారు.


