News March 29, 2025
నిజామాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడంటే?

నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. శుక్రవారం మెండోరాలో 41.5℃, పెర్కిట్, మోర్తాడ్, కోటగిరి 41.4, మల్కాపూర్, వేంపల్లె 41.3, లక్మాపూర్, యడపల్లి 41.2, ముప్కాల్, వైల్పూర్ 41.1, కమ్మర్పల్లి, యర్గట్ల, కొండూరు 41, బాల్కొండ 40.9, మంచిప్ప 40.8, గోపన్నపల్లి, తొండకూర్ 40.7, మోస్రా, మగ్గిడి 40.5, రెంజల్, సిరికొండ, భీంగల్, మాచెర్ల 40.4, ధర్పల్లి, గన్నారం, కోనసమందర్లో 40.2℃ ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News February 11, 2026
NZB: పోటీలో మొత్తం 714 మంది అభ్యర్థులు: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలోని కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలలో మొత్తం 714 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి వివరించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అత్యధికంగా నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో 350 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారన్నారు. బోధన్లో 162 మంది, ఆర్మూర్లో 153 మంది, భీంగల్లో 49 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వెల్లడించారు.
News February 10, 2026
NZB: మున్సిపల్ ఎన్నికల పంపిణీ కేంద్రాల వివరాలివే!

నిజామాబాద్ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల కోసం పంపిణీ కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఇలాత్రిపాఠి తెలిపారు. నిజామాబాద్ నగరం కోసం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, బోధన్కు విజయ మేరీ హైస్కూల్, ఆర్మూర్కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు భీంగల్కు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
News February 10, 2026
NZB: 488 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లలో ఎన్నికల కోసం 488 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మొత్తం 3,48,116 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ప్రజలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భద్రతా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.


