News July 31, 2024

నిజామాబాద్ జిల్లాలో జోరందుకున్న వరినాట్లు

image

ఉమ్మడి జిల్లాలో వరినాట్లు ఆలస్యమైన విషయం తెల్సిందే. ఈ ఏడాది సాగు సమయానికి ఆశించిన రీతిలో వర్షాలు రాకపోవడంతో అన్నదాతలు వరినాట్లు వేయడానికి సంకోచించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు వరినాట్లకు సిద్ధమైయ్యారు. ఈ సమయంలో రుణమాఫీ అవ్వడంతో రైతులకి పెట్టుబడులకు కలిసి వచ్చినట్లైంది. ఇది ఇలా ఉండగా నాట్లు వేయడానికి రైతులకు కూలీలు దొరకకపోవడంతో బిహార్ వాసులను ఆశ్రయిస్తున్నారు.

Similar News

News February 7, 2025

కోటగిరి: ఎత్తోండ క్యాంపులో అక్రమ ఇసుక డంపులు

image

కోటగిరి మండలం ఎత్తోండ క్యాంపును అడ్డగా మలుచుకున్న కొందరు ఇసుక సూరులు యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద గల ఖాళీ స్థలంలో ఇసుక డంపులు చేసి రాత్రికి రాత్రి వాటిని టిప్పర్ల ద్వారా బోధన్, నిజాంబాద్ పట్టణాలకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఈ విషయమై గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడంలేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

News February 7, 2025

నిజామాబాద్‌లో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో మాక్లూర్‌కు చెందిన షేక్ ఫర్వాన్ (24), షేక్ ఇంతియాజ్ (22) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా లారీ డ్రైవర్ పరారైనట్లు ఎస్ఐ ఆరీఫ్ వెల్లడించారు.

News February 7, 2025

NZB: కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్  

image

రైతు భరోసా నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం పట్ల బీఆర్ఎస్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. వెంటనే ఏకకాలంలో రైతు భరోసా నిధులు అన్నిటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సర్పంచులకు పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

error: Content is protected !!