News January 22, 2025
నిజామాబాద్ జిల్లాలో తొలిరోజు 20,588 దరఖాస్తులు

నిజామాబాద్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన గ్రామసభల్లో 20,588 అప్లికేషన్స్ స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం 4,326, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 2,708, రేషన్ కార్డుల కోసం 13,554 అప్లికేషన్స్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల గ్రామసభ ప్రశాంతంగా జరగ్గా, మరికొన్ని చోట్ల రసాభాసగా మారింది. గాదెపల్లిలో సభ బహిష్కరించారు.
Similar News
News February 6, 2026
ఆర్మూర్: కుటుంబ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

భర్త కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఆర్మూర్కు చెందిన వివాహిత సాగరిక గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అధనంగా రూ.20 లక్షలు కట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు, ఆడబిడ్డలు వేధించడంతో తీవ్ర మనోవేధనకు గురై ఉరేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలి తమ్ముడు సాయి కృష్ణ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
News February 6, 2026
NZB: గోదావరి పుష్కరాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో గురువారం గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. నిజామాబాద్ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన కందకుర్తి, తాడ్బిలోలి, కోస్లీ, తుంగిని, బినోల, ఉమ్మెడ, పోచంపాడ్, సావెల్, తడ్పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ వద్ద 15 పుష్కర ఘాట్లు ఉన్నాయన్నారు.
News February 6, 2026
NZB: గోదావరి పుష్కరాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో గురువారం గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. నిజామాబాద్ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన కందకుర్తి, తాడ్బిలోలి, కోస్లీ, తుంగిని, బినోల, ఉమ్మెడ, పోచంపాడ్, సావెల్, తడ్పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ వద్ద 15 పుష్కర ఘాట్లు ఉన్నాయన్నారు.


