News November 2, 2024
నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ

నిజామాబాద్ సుభాష్ నగర్ న్యూ ఎన్జీవో కాలనీలో తాళం వేసిన ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. కాలనీకి చెందిన సముద్రాల ఏలేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి ఊరెళ్లగా గుర్తు తెలియని దొంగలు తాళం పగుల గొట్టి చోరికి పాల్పడ్డారు. బీరువాలోని 22 తులాల బంగారు, 8 తులాల వెండి ఆభరణాలు దోచుకుపోయారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ SHO మహేశ్ తెలిపారు.
Similar News
News November 11, 2025
NZB: జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా క్రీడాకారులు

జాతీయస్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లాకు చెందిన 10 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు 10 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. ఈ నెల 21 నుంచి 23 వరకు పంజాబ్లో జరిగే జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నారన్నారు.
News November 11, 2025
NZB: ఢిల్లీలో పేలుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: ఎంపీ

ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎంపీ అర్వింద్ ట్వీట్ చేశారు.
News November 10, 2025
TU అధికారులు వెంటనే హైకోర్టు తీర్పును అమలు చేయాలి: AISF

TUలో 2012లో ఉద్యోగ నోటిఫికేషన్లో జరిగిన నియామకాలను రద్దు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును TU అధికారులు వెంటనే అమలు చేయాలని AISF యూనివర్సిటీ కన్వీనర్ సంజీవ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ టీయూ అధికారులు తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. యూనివర్సిటీ వీసీ, రిజిస్టర్ వెంటనే స్పందించాలన్నారు.


