News April 13, 2025

నిజామాబాద్ జిల్లాలో మాచర్ల వాసుల మృతి 

image

మాచర్లకి చెందిన షేక్ షాదుల్లా, ఆయన బావమరిది మహమ్మద్ రఫీక్‌లు నిజామాబాద్‌లో మృతిచెందారు. నందిపేట పరిధి సిద్దాపూర్ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. షేక్ రఫీక్ కాలుజారి ప్రమాదవశాత్తు వాగులో పడ్డాడు. అతనిని రక్షించేందుకు షాదుల్లా వాగులో దిగాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగి ఊపిరాడక కన్నుమూశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాలను వెలికి తీసి దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News

News September 17, 2025

జగిత్యాల: నవంబర్‌లో డీఈఐఈడీ, డీపీఎస్ఈ పరీక్షలు

image

2024-26 బ్యాచ్‌కు చెందిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లోమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్ లో నిర్వహించబడతాయని జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. లేట్ ఫీజు లేకుండా ఈనెల 22లోగా ప్రిన్సిపల్‌కు ఫీజులు చెల్లించవచ్చన్నారు. 50 రూపాయల లేట్ ఫీజ్ తో ఈనెల 29 వరకు ఫీజులు చెల్లించవచ్చన్నారు. ఆన్లైన్ లో అయితే లేట్ ఫీజు లేకుండా 23లోగా లేట్ ఫీజు తో 30లోగా చెల్లించాలన్నారు.

News September 17, 2025

NZB: జాతీయ పతాకాన్ని ఎగరవేసిన CM సలహాదారు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రగతిని వివరించారు. కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, CP సాయి చైతన్య, MLAలు భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

News September 17, 2025

వీరుల త్యాగానికి సాక్షిగా పాలకుర్తి!

image

తెలంగాణ ప్రజాస్వామ్య పోరాట కేంద్రంగా పాలకుర్తి పేరొందింది. చాకలి ఐలమ్మ, చౌదవరపు విశ్వనాధం వంటి వీరులు దొరల పాలన, నిజాం సవరణకు వ్యతిరేకంగా పోరాడి ఈ ప్రాంతానికి చరిత్రాత్మక ఘట్టాలు అందించారు. గూడూరు గ్రామం 20 మంది స్వాతంత్ర్య సమరయోధులను అందించింది. వీరి త్యాగాలు, సమర్పణలు పాలకుర్తిని ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిపాయి.