News March 18, 2025

నిజామాబాద్ : నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు

image

*NZB: ఇంటర్ పరీక్షలు.. 831 మంది గైర్హాజరు
*అభివృద్ధికి SDF కింద రూపాయలు 1000 కోట్లు ఇవ్వండి: ఆర్మూర్ MLA
*టూరిజం డెవలప్మెంట్ జరుగుతుంది: ఇన్చార్జ్ మంత్రి
*పసుపు రైతుల సమస్యలు ప్రస్తావించిన: బాల్కొండ ఎమ్మెల్యే
*టూరిజం అభివృద్ధి చేయాలి: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
*ఎడపల్లి: కుళ్లిన స్థితిలో మృతదేహం
*ఏర్గట్ల: WAY 2 NEWSతో GROUP-2 6వ ర్యాంకర్
*NZB: జలాల్పూర్ ఆలయాల్లో దొంగ చేతివాటం

Similar News

News March 18, 2025

మహిళలను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం: MLC కవిత

image

మహిళలకు మోసం చేశామని ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలో ఆమె మహిళా వ్యతిరేక సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని స్పష్టం చేశారు. స్వయంగా సీఎం అసెంబ్లీలో దురుసుగా మాట్లాడడమే కాకుండా స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయబోమని చెప్పకనే చెప్పారని ఆక్షేపించారు. కాంగ్రెస్ మెనిఫెస్టోలోని హామీలు విస్మరించిందని అన్నారు.

News March 17, 2025

NZB: ప్రజావాణికి 64 ఫిర్యాదులు

image

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 64 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌తో పాటు, ఆర్డీవో రాజేంద్రకుమార్‌కు  అర్జీలు సమర్పించారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

News March 17, 2025

 NZB: ఇంటర్ పరీక్షలు.. 831 మంది గైర్హాజరు

image

నిజామాబాద్ జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షకు మొత్తం 831 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నిజామాబాద్ DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 20,110 మంది విద్యార్థులకు గాను 19,279 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. కాగా, నేటి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని రవి కుమార్ వివరించారు.

error: Content is protected !!