News October 13, 2025

నిజామాబాద్: ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

image

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నిజమాబాద్ సీపీ సాయి చైతన్య ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను సీపీకి విన్నవించారు. మొత్తం 20 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. వాటి పరిష్కారానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే ప్రజావాణిలో నేరుగా సంప్రదించాలన్నారు.

Similar News

News October 13, 2025

నిజామాబాద్: 8వ జాతీయ పోషణ మాసోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

image

8వ జాతీయ పోషణ మాసం 2025 సందర్భంగా సోమవారం IDOC సమావేశ మందిరంలో పోషణ మాసానికి సంబంధించిన పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఈ నెల 16న జరిగే సమావేశం విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావి, మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్దుల శాఖా జిల్లా అధికారిణి రసూల్ బీ పాల్గొన్నారు.

News October 13, 2025

నిజామాబాద్: పోలీసు సిబ్బందికి ఉలెన్ జాకెట్స్ అందజేత

image

చలికాలం సమీపించిన నేపథ్యంలో విధి నిర్వహణలో పోలీసులకు ఉపయుక్తంగా ఉండే ఉలెన్ జాకెట్స్, హావర్ సాక్స్‌లను నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అందజేశారు. ఈ మేరకు సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో ఏఆర్, సివిల్ పోలీసు సిబ్బందికి ఉలెన్ జాకెట్స్ అందజేసి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, స్పెషల్ బ్యాంక్ సబ్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ రెడ్డి, RSI నిషిత్, సుమన్ పాల్గొన్నారు.

News October 13, 2025

ప్రజావాణికి 88 ఫిర్యాదులు: NZB అదనపు కలెక్టర్

image

నిజామాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 88 ఫిర్యాదులు వచ్చాయని అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌లు అంకిత్, కిరణ్ కుమార్‌తో పాటు డీఆర్డీఓ సాయాగౌడ్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, బోధన్ ఏసీపీ శ్రీనివాస్‌లకు అందజేశారు.