News January 25, 2025
నిజామాబాద్: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాది

నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో 15వ జాతీయ ఓటరు దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాదిగా నిలుస్తోందని, దీనిని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 6, 2026
ఆర్మూర్: కుటుంబ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

భర్త కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఆర్మూర్కు చెందిన వివాహిత సాగరిక గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అధనంగా రూ.20 లక్షలు కట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు, ఆడబిడ్డలు వేధించడంతో తీవ్ర మనోవేధనకు గురై ఉరేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలి తమ్ముడు సాయి కృష్ణ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
News February 6, 2026
NZB: గోదావరి పుష్కరాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో గురువారం గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. నిజామాబాద్ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన కందకుర్తి, తాడ్బిలోలి, కోస్లీ, తుంగిని, బినోల, ఉమ్మెడ, పోచంపాడ్, సావెల్, తడ్పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ వద్ద 15 పుష్కర ఘాట్లు ఉన్నాయన్నారు.
News February 6, 2026
NZB: గోదావరి పుష్కరాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో గురువారం గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. నిజామాబాద్ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన కందకుర్తి, తాడ్బిలోలి, కోస్లీ, తుంగిని, బినోల, ఉమ్మెడ, పోచంపాడ్, సావెల్, తడ్పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ వద్ద 15 పుష్కర ఘాట్లు ఉన్నాయన్నారు.


