News August 20, 2025

నిజామాబాద్: ప్రశాంతంగా PG, B.Ed పరీక్షలు.. 191 మంది గైర్హాజరు

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న PG, B.Ed పరీక్షలు 7పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయని అడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం జరిగిన PG 2,4సెమిస్టర్ల రెగ్యులర్,బ్యాక్ లాగ్ పరీక్షల్లో 2,366 మందికి గాను 2,240 మంది హాజరవగా,126 మంది గైర్హాజరయ్యారు. B.Ed 2,4సెమిస్టర్ల రెగ్యులర్,బ్యాక్ లాగ్ పరీక్షల్లో 1,444 మందికి గాను 1,379 మంది హాజరవగా 65 మంది గైర్హాజరయ్యారు.

Similar News

News August 21, 2025

జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు: కలెక్టర్ ప్రావీణ్య

image

సంగారెడ్డి జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. బుధవారం ఆమె సిర్గాపూర్‌లో ఫర్టిలైజర్ దుకాణంలో ఎరువుల విక్రయాలను పరిశీలించారు. జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన యూరియా సమృద్ధిగా ఉందని తెలిపారు. యూరియాను పంట సాగుకు మాత్రమే వినియోగించాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ టీం అక్రమ రవాణా జరగకుండా చూస్తుందన్నారు.

News August 21, 2025

విజ్డన్ ప్లేయర్స్‌లో నంబర్ వన్‌గా జైస్వాల్

image

ప్రపంచంలోనే బెస్ట్ యంగ్ ప్లేయర్‌గా టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ నిలిచారు. విజ్డన్ టాప్-40 ర్యాంకింగ్స్‌లో జైస్వాల్ టాప్‌లో నిలిచారు. సాయి సుదర్శన్ (9), నితీశ్ (12), తిలక్ వర్మ (14), వైభవ్ (16), హర్షిత్ (21), పరాగ్ (27), ముషీర్ (31), మయాంక్ (33) స్థానాలు దక్కించుకున్నారు. టాప్-10లో జేడెన్ సీల్స్, బెతేల్, ఒరూర్కీ, ప్రిటోరియస్, నసీమ్ షా, గుర్బాజ్, మఫాకా, ఇబ్రహీం జద్రాన్ నిలిచారు.

News August 21, 2025

తూప్రాన్: 4 నెలల క్రితం భర్త మృతి.. భార్య సూసైడ్

image

భర్త మరణంతో కుటుంబ పోషణ భారమై భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తూప్రాన్ ఎస్ఐ శివానందం తెలిపారు. తూప్రాన్‌కు చెందిన గజ్జల బాబుకు సంధ్యతో వివాహం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో 4 నెలల క్రితం బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. బాబు మరణంతో భార్య సంధ్య(34)కు కుటుంబ పోషణ భారమైంది. ఈ క్రమంలో 13న ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.